జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన.

జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి

జైపూర్,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ బదిలీల ప్రక్రియలో జైపూర్ పోలీస్‌ స్టేషన్‌ కి నూతన రెండవ ఎస్సైగా రామలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందు నుండి పోస్ట్ ఖాళీగా ఉండడంతో రెండవ ఎస్సై గా ఎస్సై నాగరాజును స్థానిక పిఎస్ కు ఉన్నతాధికారులు నియమించారు.దీనితో ఈ పోస్ట్ కు గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రామలక్ష్మి పదోన్నతి పై జైపూర్ పిఎస్ కి బదిలీ అయ్యారు.బాధ్యతలు చేపట్టిన రెండవ ఎస్సై రామలక్ష్మి కి ఏసీపి వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.పదోన్నతులతో బాధ్యతలు మరింత పెరుగుతాయని సూచించి,విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలన్నారు.ఫిర్యాది దారుల సమస్యలను మర్యాదపూర్వకం గా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అదే క్రమంలో నూతన రెండవ ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి కి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై రామలక్ష్మి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జూదం,అక్రమ మద్యం,మాదకద్రవ్యాలు తదితర వాటిపై పోలీస్ వారి ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు.!

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్

హన్మకొండ, నేటిధాత్రి:

సీఎం ను కించపరుస్తూ కార్యక్రమాలు చేయడం పై మండిపడ్డ నిరుద్యోగ జేఏసి నాయకులు
నిరుద్యోగ జేఏసి రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపు మేరకు…
కాకతీయ యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ శునకానందం పొందిన ఓయూ బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి పిలుపు మేరకు కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసి బృందం కేయూ పీఎస్ లో ఎస్.ఐ అనంతరి మధు కి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సి.ఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఓయూ లోని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ, పిచ్చి కుక్క అని నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీశారని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు, గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సీఎం పై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం పై నిరుద్యోగ జెఏసి నేతలు మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి నాయకులు గుండేటి సుమన్, ముత్యాల సాయి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version