“రైతులపై ఐకెపి దోపిడీ–బీఎస్పీ తీవ్ర ఆగ్రహం”

రైతులను మోసం చేస్తున్న ఐకెపి రైస్ మిల్లర్స్ యజమానులు

పొన్నం భిక్షపతి గౌడ్
బహుజన్ సమాజ్ పార్టీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమట్ల మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్ అనంతరం మాట్లాడుతూ…. టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి రేగొండ మండలాల కేంద్రాలలో నిర్వహిస్తున్న ఐకెపి సెంటర్ నిర్వాహకులు మ్యాచరు తరుగు పేరుతో ఒక బస్తాకు నాలుగు కిలోల నుండి 5 కిలోల వడ్లను దౌర్జన్యంగా రైతులను బెదిరిస్తూ తీస్తున్నారని సదరు రైస్ మిల్లర్ల ఓనర్లతో కుమ్మక్కైన ఐకెపి నిర్వాహకులు రైతులను మోసం చేస్తూ వస్తున్నారని ముఖ్యంగా టేకుమట్ల చిట్యాల మండలాలలోని రైస్ మిల్లర్ల యాజమానులు చెప్పిందే వేదంగా ఐకెపి సెంటర్ నిర్వాహకులు నడుచుకుంటున్నారని జిల్లా వ్యవసాయ సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడము వారి అక్రమాలకు అడ్డులేకుండా పోతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పంట గిట్టుబాటు ధర బోనస్ లు వారు తీసే తరుగులోనే పోతుందని రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే ఐకెపి సెంటర్ నిర్వాహకులు మ్యాచరుకు రావట్లేదని రైతులను ఇబ్బందుల గురి చేస్తూ వస్తున్నారని ఇట్టి విషయంపై జిల్లా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని అదేవిధంగా సీసీఎల్ పత్తి కొనుగోళ్ల విషయంలో కూడ ఇదే ధోరణి అవలంబిస్తున్న సంబంధిత నిర్వాహకులపై వెంటనే ప్రభుత్వం జిల్లా అధికారిక యంత్రంగా స్పందించాలని లేని ఎడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం వ్యవసాయ సంబంధిత డైరెక్టర్ కి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా అన్నారు

బహుజనుల రాజకీయాల ఐక్యతే…

బహుజనుల రాజకీయాల ఐక్యతే
అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యానికి విరుగుడు…
పొన్నం బిక్షపతి గౌడ్ BSP జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గారు హాజరై మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతూ అందకారానికి దగ్గర చేస్తున్నాయని విద్య- వైద్యం- గూడు కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో వారి దొంగ నాటకాలను అరికట్టాలని 42% BC రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీనీ ఆదరించాలని పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా మొగుళ్లపల్లి మండల అధ్యక్షులుగా కళాశ చిరంజీవి మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షులుగా మురారి మనోజ్ గార్లను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొచ్చు తిరుపతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా EC మెంబర్ భూపాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి పుల్యాల భగత్ మరియు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version