ఘనంగా చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమం…

ఘనంగా చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమం.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి కేక్ కట్ చేసుకుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది, ఇట్టి కార్యక్రమం చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నరసయ్య, వనపర్తి సతీష్ (ప్రధాన కార్యదర్శి), కొడగంటి గంగాధర్ (కోశాధికారి) ఆధ్వర్యంలో చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి మల్లయ్య మరియు చందుర్తి రజక సంఘం సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రజక సంఘం సభ్యులు అలాగే చందుర్తి మండల నాయకులు పాక్స చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు పులి సత్యం, గొట్టె ప్రభాకర్, బైరబోని రమేష్, బత్తుల కమలాకర్, చిలుక పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తొలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలని. పెత్తందారులతో, రజాకార్లతో, దొరలతో, భూస్వాములతో కొట్లాడి ఎన్నోవేల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ధీర వనిత అని కొనియాడారు. ఇప్పటి యువత ఆమె స్ఫూర్తితో ఆమె ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం…

చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘన నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అని ఆమె జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకం నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మగారి పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకమని, ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారు అని, ఆమె ధైర్యం పట్టుదల అందరికీ ఆదర్శం కావాలని తెలిపారు

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ…

పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల నీటి ధాత్రి

 

 

తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తే సామాన్యుడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలువచ్చని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version