న్యాల్కల్ మండలంలో పదో తరగతి పరీక్షలకు 455 మంది విద్యార్థులు హాజరు…

న్యాల్కల్ మండలంలో పదో తరగతి పరీక్షలకు 455 మంది విద్యార్థులు హాజరు

జహీరాబాద్, నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) మారుతి తెలిపిన వివరాల ప్రకారం, మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 455 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 45 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version