ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి వార్నింగ్.

ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి వార్నింగ్

సిరిసిల్ల టౌన్(నేటి ధాత్రి):

 

 

బైసరాన్ లోయలోని పహల్గామ్ సమీపంలోని పర్యాటక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రవాదులు కుటుంబాల్లోని పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఈ ఘటనతో అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు.ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టడం వెనుక గొప్ప సంకేతార్థం ఉంది. “సిందూర్” భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టైంది.ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేయడం కోసం “ఆపరేషన్ సిందూర్” అని పేరుతో
పహల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన కు శ్రీకారం చుట్టిందని, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై “ఆపరేషన్ సిందూర్” పేరుతో మెరుపు దాడులు చేసి, దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక, పూజలు ప్రార్థనలు నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో పట్టా కాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో ఆడెపు రవీందర్, రాంప్రసాద్, భాస్కర్, ప్రతాప్, నరేష్, శ్రీహరి, రాజు, నరసయ్య, శ్రీనివాస్, చందు, పరమాత్మ శేఖర్, వైశాలి, మాధవి, శిరీష, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version