ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్
నేడు జరిగే జాతీయ సెమినార్కు సర్వం సిద్ధం
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్,నిర్వహణ కార్యదర్శి డాక్టర్ రాంబాబు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో మంగళవారం జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. సెమినార్ కు సంబంధించిన బ్రోచర్లను సెమినార్ కార్యదర్శి డాక్టర్ రాంబాబుతో అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ప్లాంట్ సైన్స్- ఇష్యూస్ అండ్ ఛాలెంజ్స్ ఇన్ క్రాప్ ఇంప్రుమెంట్ అనే అంశంపై జాతీయ సెమినార్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.
ఈ సెమినార్ నిర్వహణకు రూసా స్పాన్సర్షిప్ అందించడం విశేషమని చెప్పారు.కళాశాలలో సభా వేదిక, అతిథుల స్వాగతం, పాల్గొనే అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం అవసరమైన సౌకర్యాలు సమకూర్చబడ్డాయని పేర్కొన్నారు.సదస్సు కు కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ చీఫ్ పేట్రన్ దేవసేన,ఆర్జేడీ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్, ఆర్జేడీ జోన్ II బాల భాస్కర్, రుసా డైరెక్టర్ సౌందర్య జోసెఫ్ రానున్నారని అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి ను ఆహ్వానించమని తెలిపారు.మహారాష్ట్ర,ఆంధ్రా ప్రదేశ్,తెలంగాణ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఉపన్యాసకులు, ప్రముఖ వక్తలు సదస్సుకు పాల్గొంటున్నారని వివరించారు.వందకు పైగా పరిశోధన పత్రాలు సమర్పనకు ఉన్నాయని నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.సెమినార్ నిర్వహణ కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ జాతీయ సెమినార్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.పాల్గొనే వారు కార్యక్రమ మార్గదర్శకాలను పాటిస్తూ సమయానికి హాజరుకావాలన్నారు.సెమినార్ శాస్త్రీయ చర్చలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం కళాశాల అధ్యాపకులు, నిర్వాహక బృందం, సిబ్బంది సహకారంతో విజయవంతం కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
