పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పలువురు అధికారులు గురువారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, సీఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
