పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి నేటి ధాత్రి :
తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని 26 వ వార్డులో గల టి.పి. ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను కూడా వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. హోటల్స్ వద్ద తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించి, క్రమం తప్పకుండా చెత్త సేకరణ మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల అనుమతులు పరిశీలించాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, డి.ఈ. లలిత, ఏసిపి లు బాలాజి, మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.