జర్నలిస్టుల అరెస్టులను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోంది

జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము

ఇది మీడియా స్వేచ్ఛపై నేరుగా దాడి

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యూజే-ఐ)

భూపాలపల్లి నేటిధాత్రి

 

సీనియర్ జర్నలిస్టులైన దొంతు రమేష్,చారి,సుధీర్లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్.యూజే-ఐ) తీవ్రంగా ఖండిస్తుందని టిఎస్ జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు తెలిపారు.బుధవారం వారు మాట్లాడుతూ
ఈ అరెస్టులు మీడియా స్వేచ్ఛను హరించే చర్యలని అన్నారు.ఈ అరెస్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం,వీడియో స్వేచ్ఛగా రాయొద్దు,ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు,అధికారంలో ఉన్నవారి మీద కథనాలు రాస్తే జైలు తప్పదు అని చెప్పాలనుకుంటున్నట్టుగా ఈ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.ఒక పత్రికలో లేదా మీడియాలో ఒక అంశంపై కథనం వచ్చినప్పుడు,అందులోని నిజానిజాలపై అధికారులు విచారణ జరిపించాలి.కానీ ఆ అంశాన్ని బయటికి తీసుకొచ్చిన జర్నలిస్టుల మీదే కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా సమంజసం కాదన్నారు.అనేక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే కథనాలు తయారవుతాయన్నారు.ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు, అధికారులు మీద ఆరోపణలు వస్తే,ఆ ఆరోపణల నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వం,తప్పు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కానీ ఆ పని చేయకుండా,జర్నలిస్టుల మీద పడి కేసులు పెట్టడం అంటే,ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడమేనని చెప్పారు.ఏ వ్యక్తిగత ఫిర్యాదు లేకుండా,ఆ కేసులో పేర్లు లేకున్న కేవలం ఒక సంఘం ఫిర్యాదును ఆధారం చేసుకొని జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పూర్తిగా తప్పని, ఇది చట్టం కాదనీ ,ఇది భయపెట్టే ప్రయత్నం అన్నారు.ప్రభుత్వం ఈ కేసు ను వెంటనే ఎత్తివేసి,జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.మీడియా స్వేచ్ఛపై దాడులు ఆపకపోతే పెద్ద జర్నలిస్ట్ ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్,సంయుక్త కార్యదర్శులు కడపాక రవి,పల్నాటి రాజు, మారపేల్లి చంద్ర మౌళి, భూపాల్,జగన్, కారుకూరి సతీష్ హేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి పోరాటం ఫలితం..

*ఏపీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి పోరాటం ఫలితం..

*త్వరలోనే రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు..

*జర్నలిస్టుల అక్రిడేషన్ మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం..

*సీఎం నారా చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు తెలిపిన ఢిల్లీ బాబు రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి) ఆగస్టు 05:

రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ త్వరలోనే కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని త్వరలోనే కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పలు సందర్భాల్లో చర్చించారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని అక్రిడేషన్ త్వరగా మంజూరు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్థసారధిని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి పలువురు జర్నలిస్టులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తమ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తి సానుకూలతతో ఉందని, జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల దృక్పథంతో ఉన్నారని అన్నారు. జర్నలిస్టుల జర్నలిస్టుల సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల విషయ క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లను ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చిందన్నారుఅర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, విశ్రాంతి జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ,ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం వినతి సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పోరాట ఫలితంతో రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version