పంట పొలాల్లోనే నేలకొరిగిన వరి…

పంట పొలాల్లోనే నేలకొరిగిన వరి

పొలంలో… రైతుల్లో… కన్నీళ్లు

నష్టాన్ని అంచనా వేయని అధికారులు

మాజీ స్పీకర్ మధుసూదనాచారి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో అకాల వర్షంతో నీళ్లలోనే పొలాలు రైతుల కంట కన్నీళ్లు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది ఇటీవల కురిచిన భారీ వర్షాలతో చేతికి వచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కోతకు వచ్చిన పంట పొలాల్లో నీరు చేరి గొలుసులు మొలకెత్తుతున్న పట్టించుకోని అధికారులు. కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు ప్రతికూల పరిస్థితుల్లో రెక్కలు కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ప్రతికూల పరిస్థితిలో రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట చేతికి రాక గుండెలు బాదుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరడమైనది

అప్పుల ఊబిలో అన్నదా తలు

సాగు చేసిన మొదలు విత్త నాలు ఎరువులు, మందులు కోతల ఖర్చులు రూపంలో రూపాయల లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుఫాను తీవ్రతకు చేతికి వచ్చిన వరి పంట నేల వాలి మొలకెత్తుతున్న దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరు పెడుతున్నారు.కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వంలో చలనం లేదు

మాజీ స్పీకర్ మధుసూదనాచారి

ఆరు గాలం శ్రమించి పండించిన పంట నేల వారిన పంట మొలకెత్తుతుంటే చేనులో నీళ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మాజీ స్పీకర్ చారి మాట్లాడుతూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది భారీ తుఫానుకు పంట పొలాలు తీవ్ర నష్టం వాటిల్లాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతే రాజును చేసిన ఘనత. అదేవిధంగా మండల, గ్రామాల అభివృద్ధి, రైతులకు అందుబా టులోకి సౌకర్యాలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వా న్నిది. మాజీ స్పీకర్ గా ఉన్నప్పుడు రైతులకు అందు బాటులోకి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి, రైతులకు న్యాయం చేయడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం యూరియా కొరత రైతులను ఇబ్బంది పెట్టడం, తుఫాను ప్రభావంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు అంచనా వెయ్యక పోవడం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్న ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

మొంత తుఫాన్ బీభత్సం… నేలకొరిగిన పంట పొలాలు..

మొంత తుఫాన్ బీభత్సం… నేలకొరిగిన పంట పొలాలు

నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి

మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

తుఫాను ప్రభావంతో చేతికి అందిన పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి పరిహారం చెల్లించి ఆదుకోవాలి మానుకోట మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అనేక విధాలుగా రైతులు ఈ ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొని ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరికొద్ది రోజుల్లో కోత దశకు వస్తున్న నేపథ్యంలో ఈ తుపాను కారణంగా నియోజకవర్గంలో అనేకచోట్ల వరిచేను నీలమట్టం కావడం రైతులు పార్టీ నాయకుల ద్వారా తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక మండల నాయకులతో కలిసి కేసముద్రం మండలం ధనసరి గ్రామంలో నీలమట్టమైన వరి పంటను ఆయన పరిశీలించారు తక్షణమే సంబంధిత అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేసి బాధిత రైతులకు చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్, ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, బానోతు వెంకన్న నాయక్, బిర్రు వెంకన్న, బానోత్ శ్రీను నాయక్, బండారు గోపి, వంగల అశోక్, భానోత్ భీమన్న, గణేష్,బాధవత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version