ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో నాలుగు రోజులపాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవా లు ఏప్రిల్ 22 2026 ద్వజా వరోహణంతో ముగిస్తారు ఉత్సవాల చివరి రోజు ఉద యం షష్టి సుదర్శన హోమం, చండీ హోమం, పూర్ణాహుతి ధ్వజావరోహణం ఉత్సవం నిర్వహిస్తారు

ఈ కార్యక్ర మాలను వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ముగింపునకు ప్రత్యుణ్య దీక్షిత్ శర్మ, శరత్ చంద్ర శర్మ, హరి ప్రసాద్ శర్మ, సాయి ప్రణీ త్ శర్మ ఆధ్వర్యంలో షష్టి సుదర్శన హోమం, చండీ హోమంను మంత్రోచ్ఛారణల మధ్య ముగింపుగా పూర్ణా హుతి ద్వజావరోహణంతో ముగిసింది.

మండలంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, అంతేకాకుండా రైతులు పాడిపంటలతో సుఖసంతో షాలతో ఆయు ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరడ మైనది. ఈ కార్యక్రమంలో చైర్మన్ దేవాలయ కమిటీ సూర్యప్రకాష్ మాజీ ఎంపీటీసీ మరి యు తెలంగాణ కనీస వేతన బోర్డు సభ్యుడు చంద్ర ప్రకాష్, బాసని విశ్వప్రకాష్, జయప్రకాష్, దంపతులు, మహిళలు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

రేపటి నుంచి బడంపేట రాచన్న స్వామి దేవాలయ జాతర…

రేపటి నుంచి బడంపేట రాచన్న స్వామి దేవాలయ జాతర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేట గ్రామ శివారులోని రాచన్న స్వామి దేవాలయ జాతర ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శివ రుద్రప్ప శనివారం తెలిపారు.
22న రుద్రాభిషేకం, ధ్వజారోహణ, 23న ప్రత్యేక పూజలు, 24న కళ్యాణోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.

ఘనంగా ప్రారంభమైన అయినవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన అయినవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

నేటి ధాత్రి అయినవోలు

 

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ విఘ్నేశ్వర పూజ పుణ్యా వచనము ధ్వజారోహణము మహాన్యాస పూక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహనివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థపర ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. తద్వారా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఎస్.ఐ శ్రీనివాస్,ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,పాతర్లపాటి నరేష్ శర్మ, మడికొండ దేవేందర్ అర్చక సిబ్బంది ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version