జాతీయసేవారత్న అవార్డు అందుకున్న న్యాయవాది రమేష్ నాయక్…

జాతీయసేవారత్న అవార్డు అందుకున్న న్యాయవాది రమేష్ నాయక్

భూపాలపల్లి నేటిధాత్రి

బహుజన సాహిత్య అకాడమీ 2026 అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది భూక్య రమేష్ నాయక్ జాతీయ సేవారత్న అవార్డు అందుకున్నారు. ఈమేరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో న్యాయవాది రమేష్ నాయక్కు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు, నేషనల్ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మెన్ వల్ల నాధాకృష్ణ చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు రాధకృష్ణ్ను మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థి దశలో విద్యార్థుల హక్కులకై, టీఎస్ జెన్కోలో హెన్ఆర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ కార్మిక నేతగా ఎదిగి కార్మికుల హక్కులను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. అంతేకాకుండా జెన్కోలో నిరుద్యోగులకు ఉద్యోగాలశాలు కల్పించాలని అనేకపోరాటాలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాడన్నారు. 2019 నుండి న్యాయవాద వృత్తిని చేపట్టి రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో న్యాయం వైపు వాదిస్తూ అనేకమంది బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు న్యాయ సేవలను అందించినందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ న్యాయవాది రమేష్నాయక్కు జాతీయ సేవారత్న అవార్డు అందజేశామన్నారు. రమేష్ నాయక్ మున్ముందు రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు తనవృత్తి పరమైన, ఇతరత్రమైనా మరిన్ని సేవకార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. జాతీయస్థాయిలో సేవారత్న అవార్డు అందుకున్న న్యాయవాది రమేష్ నాయక్ను జిల్లా కేంద్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు, న్యాయవాదులు, విద్యావంతులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version