తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన జె ఏ సి నాయకులు.
చిట్యాల, నేటిదాత్రి :
42 శాతం రిజర్వేషన్ సాధన సమితి పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో బిసి ఎస్సి ఎస్టీ జె ఏ సి ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కి 42% విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు 9వ షెడ్యూల్లో చేర్పు మరియు కామారెడ్డి డిక్లరేషన్ అమలు గురించి రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు 42%రిజర్వేషన్ సాధన సమితి మండల కోఆర్డినేటర్ చింతల రమేష్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నామని
రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 మరియు 4 ద్వారా మార్చి 2025లో విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలని,
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం 42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి మరియు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని
రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు మరియు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ గౌడ్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల కోఆర్డినేటర్ శీలపాక నాగరాజ్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జెన్నే యుగేందర్,బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల నాయకులు పర్లపల్లి కుమార్, పుల్ల అశోక్, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్, గడ్డం కొమురయ్య, పోన్నం అశోక్ గౌడ్, రషీద్, గుర్రం శ్రీనివాస్, సంపంగి సతీష్, మాచర్ల దయాకర్ గౌడ్ మోత వెంకటేష్ పెరుమడ్ల నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
