మల్కచెరువులో.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం…

మల్కచెరువులో.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో గల మల్కచెరువులు శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైందని స్థానిక ఎస్సై రాజేష్ తెలిపారు. మృతుడు చామన చాయ రంగులో ఉండి, నీలిరంగు ప్యాంట్, నలుపు రంగు డ్రాయర్, ఎడమ చేతి పై సూర్యుడు బొమ్మని పోలిన పచ్చబొట్టు కలిగి ఉన్నాడన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే నిజాంపేట 8712657979, రామాయంపేట 8712657933 లను సంప్రదించాలన్నారు.

16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు…

జహీరాబాద్: 16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 16, 17 తేదీల్లో కబడ్డీ జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్టిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు జరుగుతాయి. పూర్తి వివరాలకు 99891 63793, 99892 18299 నెంబర్లను సంప్రదించవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version