ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడుగా వడ్డేపల్లి కిషోర్…

ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడుగా వడ్డేపల్లి కిషోర్

ఉప్పల్ నేటిధాత్రి

 

ఉప్పల్ ప్రెస్ క్లబ్ ( ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ) నూతన అధ్యక్షుడు గా వడ్డేపల్లి కిషోర్ ఎన్నికయ్యారు . ఉప్పల్ లో సీనియర్ జర్నలిస్టులు కడారి బాలేశం , చంద్రమౌళి ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . నూతన అధ్యక్షుడుగా వడ్డేపల్లి కిషోర్ , ప్రధాన కార్యదర్శి లుగా ఆనంద నర్సింహరెడ్డి , పెంబళ్ల కుమార్ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా కొలనుపాక చంద్రమౌళి , సలహదారులుగా కడారి బాలేశం , మాటూరి శ్రీనివాస్ , మచ్చ శ్రీహరి , కంచు శ్రీనివాస్ , డి సురేష్ , పారెల్లి సాగర్ గౌరవాధ్యక్షులుగా ఓంకారం సంతోష్ రాజు , వర్కింగ్ ప్రెసిడెంట్ గా పయ్యావుల సంతోష్ , డిప్యూటి జనరల్ సెక్రటరీగా సీసా నాగరాజు , ఉపాధ్యక్షులుగా బోడ ప్రవీణ్ , కందుకూరి ప్రశాంత్ , గోరుకంటి నరేందర్ , బొంతు స్టాలిన్ , కోశాధికారులు గా ఆర్ . యాదగిరి , సారా వెంకటేష్ గౌడ్ , ఆర్గనైజింగ్ కార్యదర్శి లుగా పి.తిరుమల్ రెడ్డి , కొయ్యేడి కరుణాకర్ , ఎడపాక సురేష్ , దొడ్డి శోభన్ , శ్రవణ్ , జాయింట్ సెక్రటరీ లుగా దత్రపు దేవా , బల్ల సూర్యం , ప్రవీణ్ , కె. జీవన్ గౌడ్ సాంస్కృతిక కార్యదర్శి లుగా పబ్బు కిరణ్ , ఉపేందర్ , షేక్ పాషా , ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా బి.వి.రాజు , విష్ణు , లక్ష్మణ్ , వెంకట్ రెడ్డి , సోనిశ్రీ , ప్రసాద్ , చంద్రశేఖర్ , అరుణ్ , శ్రీకాంత్ , శ్రీధర్ , సిద్దు , జి.వెంకటేష్ , సి.చరేష్ , డి.శివ తదితరులు ఎన్నికయ్యారు . ఈ సందర్భంగా అధ్యక్షుడు గా వడ్డేపల్లి కిషోర్ మాట్లాడుతూ … ఉప్పల్ నియోజకవర్గంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యలను నిస్పాక్షికంగా వెలుగులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే, యువ జర్నలిస్టులకు మార్గదర్శకత్వం అందిస్తూ మీడియా వృత్తికి గౌరవం తీసుకొచ్చేలా నూతన కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ నూతన కమిటీ ఏర్పాటుతో ఉప్పల్ మీడియా వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, జర్నలిజం మరింత బలంగా ముందుకు సాగుతుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభినందనలు తెలిపారు .

చందుర్తి ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గం ఏకగ్రీవం

*చందుర్తి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..*

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల లింగయ్య ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే హెచ్ – 143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా సమక్షంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లింగాల తిరుమల్, ఉపాధ్యక్షులు రాజూరి విష్ణు, ప్రధాన కార్యదర్శి మ్యాకల కొమురయ్య, కోశాధికారి మేడిశెట్టి మధు, కార్యదర్శి వంకాయల కార్తీక్, కొడగంటి గంగాధర్, గౌరవ అధ్యక్షులుగా లింగాల లింగయ్య, ఏనుగుల కృష్ణ, గౌరవ సలహాదారులు గొట్టే మనోహర్, కార్యవర్గ సభ్యులు రాజూరి సద్గుణ చారి, రాజురి రఘురాం, బొట్లవార్ శ్రీనివాస్, నక్క యాకూబ్, మర్రి నిశాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ ముందుగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, టియుడబ్ల్యూజేహెచ్ – 143 సంఘం జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఇటీవల జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో ముందుండి కొట్లాడిన ఘనత మనదని అన్నారు. నేడు చందుర్తి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం సంతోషకరమని రాబోవు రోజుల్లో జర్నలిస్టుల హక్కుల కొరకు, వారి సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అలీ, విజయ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version