దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశికృష్ణ.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ మాట్లాడుతూ పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని అన్నారు. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు… నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకల రాయకోమురు దొడ్డి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల నాయకులు గుమ్మడి సత్యనారాయణ, అరెపెల్లి మల్లయ్య, అరెపల్లి నర్సింహారాములు, ఆకుల రవీందర్, శనిగరపు మొగిలి యూత్ నాయకులు అల్లం రాజు ఏకు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
