ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై యుద్ధం వెంటనే ఆపాలని కోరారు.ప్రపంచ దేశాలు శాంతి నెలకు కొలపాలని వారన్నారు. యుద్ధం సరైన పద్ధతి కాదన్నారు.అమెరికా సామ్రాజ్య వాదాన్ని నెలకొల్పాలని పచ్చిమ ఆసియాపై ఆదిపత్యం చేసుకోవాలని దురుద్దేశంతో ఇరాన్ పై దాడులు చేపించడం జరుగుతుందన్నారు.ఇరాన్ ఆణుఅయుధాలను తయారు చేస్తుందని ప్రపంచానికి తప్పుడు సంకేతాలు తీసుకవచ్చి యుద్ధం చేస్తున్నారని అన్నారు. యుద్దాల వల్ల వేలాదిమంది ప్రజలు అన్యాయంగా చనిపోతున్నారని, పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరుగుతుందని తెలిపార.
యుద్ధం వద్దు శాంతి ముద్దు అని ట్రంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ సుధాకర్ రెడ్డి మాతంగి రాంచందర్ క్యాతరాజు సతీష్ నెరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ పీక రవికాంత్ గోనెల తిరుపతి రమేష్ చారి గోలి లావణ్య శ్రావణి పల్లెర్ల రజిత శ్రీలత వాసం రజిత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.