అర్హులకు 2BHK ఇళ్ల పంపిణీపై కలెక్టర్ సమీక్ష

మంచిర్యాల జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

మంగళవారం బెల్లంపల్లి మండల కేంద్రంలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన 2BHK పథకంలో అర్హులైన వారికే ఇండ్లు కేటాయించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి రికార్డులు మరియు దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version