కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి..

కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి

ఉత్సవ కమిటీని ప్రకటన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవ కమిటీ ప్రకటన

ఈనెల 9 వరకు ఉత్సవ కమిటీకి జాతర బాధ్యతలు

నర్సంపేట /గీసుకొండ: నేటిధాత్రి:

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో గల కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. కమిటీ ఎంపిక ప్రకటనను జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో గల కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేడు 3 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవ కమిటీని ఎంపిక చేశారు.

ఈ నూతన ఉత్సవ కమిటీలో 14 మంది సభ్యుల పేర్లను ఎండోమెంట్ శాఖ ప్రకటించింది. ఈనెల 2 నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవ కమిటీలో వీరాటి రవీందర్ రెడ్డి,అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్నలను ప్రకటిస్తూ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ తో పాటు రాష్ట్ర,జిల్లా దేవాదాయ శాఖ, సంబంధిత శాఖలకు జీవో కాపీలతో ఆదేశించింది.

కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి

గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ జీవో జారీ చేయగా పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి ఉత్సవ కమిటీని ఎంపిక చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి, సభ్యులుగా అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్న పేర్లను కమిటీలో ప్రకటిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొమ్మాల జాతర ఉత్సవాలలో భక్తులకు ఇలాంటి కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు.

జాతరలో ఏలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు

శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఉత్సవాల నేపథ్యంలో జాతరకు వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి తెలిపారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు జాతర ఉత్సవ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

నేడు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం..

శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర హోలీ పండుగ రోజు నుండి 9 వ తేదీ వరకు వారం రోజులపాటు సాగే ఉత్సవాల నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు,ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు గాను చైర్మన్ తో పాటు 14 మంది సభ్యుల ఉత్సవ కమిటీని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ మంగళవారం దేవాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version