జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు.

జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ రిజిస్టర్ నెంబర్ 89 /2019,జిల్లా కమిటీ లో మార్పులు చేర్పులు గురించి గత 11 సంవత్సరముల నుండి మంచిర్యాల జిల్లాలో ఈ కమిటీ కొనసాగుచున్నది. దానిలో భాగంగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి ఐక్యత కొరకు వారి సమస్యలపై పనిచేస్తు,మహాసభలు పెడుతూ,అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఆర్ఎంపి మరియు పి.ఎం.పి ల సమస్యల పైన చర్చలు జరిపి మన పరిధి వరకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రాథమిక వైద్యం చేయవలెనని అవగాహన కల్పించడం జరిగినది.అనివార్య కారణాలవల్ల ఈ జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు చేయడం జరిగినది ప్రస్తుతం నిర్ణయించిన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు దొంతుల మొoడయ్య,ఉపాధ్యక్షుడు శైలేంద్ర రాము చారి,ప్రధాన కార్యదర్శి మేడిపల్లి విజయ్,సహాయ కార్యదర్శి కొయ్యల రాజు, కోశాధికారిగా తంగేళ్లపల్లి రాజేందర్,గౌరవ అధ్యక్షుడు డిఆర్ బెంజిమెన్,ముఖ్య సలహాదారు కుంచాల శంకరయ్య గా నిర్ణయించడం జరిగింది.

జిల్లా కలెక్టర్ మేరకు బృందాల ప్రదర్శన. !

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళా బృందాల ప్రదర్శన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర.సంబంధాల శాఖ ఆధ్వర్యంలో. తెలంగాణ సాంస్కృతిక సారధి గడ్డం శ్రీనివాస్ కళాబృందం ఆధ్వర్యంలో పలు గ్రామాలలో బృందంచే. అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు అయిన. కెసిఆర్. కాలనీ కాబట్టి ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పారిశుభ్రత పాటిస్తూ ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా .తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. తెలియజేస్తూ ముఖ్యంగా యువత పిల్లలు డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని. పెద్దలు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిసి కలకాలం. పిల్లాపాపలతో చల్లగా ఉండాలని. ముఖ్యంగా ప్రజలు వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని. కూలి పనికి వెళ్లేవారు. ఉదయం. సాయంత్రం. పనులు చేసుకోవాలని ఎండలో పనిచేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తలపాగా టోపీ గొడుగు మంచిరు వంటివి వెంట తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందిరమ్మ ఇల్లు రాజు యువ వికాసం గృహ జ్యోతి ఉచిత . వంట గ్యాస్. 200 యూనిట్ల ఇంటి కరెంటు సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో. జిల్లా సాంస్కృతిక. సారధి టీం లీడర్ గడ్డం శ్రీనివాస్. కళాకారులు. శ్రీరాముడు రామచంద్రం. గుగ్గిళ్ళ పరశురాములు. వంతడుపుల గణేష్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడి ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి.!

అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి

నిజాంపేట్, నేటి ధాత్రి :

 

 

నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడ గ్రామంలో మంగళవారం రోజున జిల్లా వెల్ఫేర్ అధికారి హైమావతి చల్మెడ అంగన్వాడి 4 వ సెంటర్ ను సందర్శించడం జరిగింది. బరువు తక్కువ ఉన్న పిల్లలు(SAM), నామ మాత్రం బరువు తక్కువ ఉన్న పిల్లలు(MAM) పిల్లల బరువులు, ఎత్తు, చూడడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడి టీచర్ లక్ష్మీనరసమ్మ, పిల్లల తల్లులు గర్భిణీలు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.!

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో పాటు. తంగళ్ళపల్లి. గీత నగర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న. టీ. జి. పాలీసెట్.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు. ఎలా జరుగుతున్నాయని ఎగ్జామ్స్ సెంటర్లో నిర్వహించిన. సీసీ కెమెరాల పరిధిలో పరిశీలించి వివరాలు అడిగి. కెమెరాల పరిశీలన ఎలా ఉందని తెలుసుకున్నారు ప్రవేశ పరీక్ష సజావుగా ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ తెలిపారు. అలాగే. తంగళ్ళపల్లి జెడ్పిహెచ్ఎస్. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ శంకర్ నారాయణ ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటార్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ కోరగా పంచాయతీ . సెక్రెటరీ కి. ప్రతిపాదనలు
అందజేయాలని ప్రిన్సిపల్ కి సూచించారు. ఇట్టి తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట. ప్రిన్సిపల్ . సూపర్డెంట్. శంకర్ నారాయణ శారద ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా:-
ఇసుక క్వారీల లైసెన్సులు రద్దు చెయ్యాలి:-

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్:-

యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ :-

భూపాలపల్లి నేటిధాత్రి:

 

శుక్రవారం రోజున సి పి ఐ ఎం ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలోని ఇసుక రీచ్ ను సందర్శించడం జరిగిందని. అనంతరం ఆయన భూపాలపల్లి లో మాట్లాడుతూ అక్కడనుండి ఇష్టానుసారంగా అధిక లోడుతో వందలాది లారీలతో ఇసుకను తరలిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలో 10 ఇసుక క్వారీలు నడుస్తున్నాయని విచ్చలవిడిగా ఇసుకను డంపు చేసుకుంటూ అధిక లోడుతో లారీల్లో తరలిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించు కుంటున్నారని తక్షణమే వారి లైసెన్స్ రద్దు చేసి  ఇసుక క్వారీ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అని డిమాండ్ చేసారు.సహజ సంపదను అక్రమంగా తరలించుకుంటు సొమ్ము చేసుకుంటున్నారని.

Transportation

  గత ప్రభుత్వంలో ఇలాగే విచ్చలవిడిగా దందా కొన సాగిందని , ఈ ప్రభుత్వంలో నైనా మార్పు వస్తుందని ఆశించిన ప్రజల ఆకాంక్ష నెరవేర లేదని , ఇప్పుడు కూడా విచ్చలవిడిగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదన ద్యేయంగా దందా కొనసాగిస్తున్నారని , అనేకమంది నిరుపేదలు యాక్సిడెంట్లో చనిపోతున్నారని , కాళేశ్వరం నుండి భూపాలపల్లి కి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిందే అని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని, అధిక ఇసుక లోడ్ల తో లారీలు నడవడం వలన రోడ్లు మొత్తం కృంగి పోయాయి అని, ఇంత నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు చూచి చూడనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇట్టి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఒక వేళ తీసుకోకపోతే పార్టీ తరుపునుండి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి !

జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను.!

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

 

 

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం.!

డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో తెలంగాణ ఉన్నత విద్య మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) జిల్లా స్థాయి హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.దోస్త్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలిగితే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో పరిష్కారం పొందగలరని తెలిపారు. కళాశాల సహాయక కేంద్రంలో విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేయబడుతుందని,డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీ కొరకు మే 3 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయని అన్నారు.ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలో జరుగుతుందని అందులో జూన్ 30 నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ వారి మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలని పేర్కొన్నారు.దోస్త్ రిజిస్ట్రేషన్ కొరకు పదవతరగతి మెమో,ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్,కుల ధ్రువీకరణపత్రం,ఆదాయధ్రువీకరణపత్రం(01-04-2025 తేదీ తరవాత తీయబడింది) 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు,ఆధార్ కార్డు ,పాస్స్పోర్ట్ సైజు ఫోటో తీసుకురాగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో దోస్త్ సమన్వయ కర్త డా.పూర్ణచందర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ,అడ్మిషన్ ఇంచార్జ్ డాక్టర్ యం.సోమయ్య,కంట్రోలర్ అఫ్ ఎగ్జామ్స్ ఎస్.కమలాకర్, రహీముద్దీన్ ,డాక్టర్ రాంబాబు, డా.భద్రు, డా.రాజీరు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి.!

రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటన

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అనాథ, నిరాశ్రయులు మరియు నిరుపేద బాలికలకు 3సం.రాల డిప్లామా కోర్సులలో ప్రవేశానికి గాను దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, హైదరాబాద్ లో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. కోర్సుల వివరాలు: డిప్లామా ఇన్ సివిల్ ఇంజనీర్ (DCE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానికల్ (DEEE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ (DCME) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE) విభాగంలో (60 సీట్లు) కలవు.
ఇందుకు గాను 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన బాలకల యొక్క కులం మరియు ఆదాయదృవీకరణ పత్రం (not for Orphans), తల్లిదండ్రుల యొక్క మరణ దృవీకరణపత్రము (in case of Orphans), బోనఫైడ్, ట్రాన్సఫర్ సర్టిఫికేట్, స్టడీ కేర్టిఫికేట్ మరియు 10 వ తరగతి మార్కుల మేమో ను సంబందిత ధరఖాస్తు ఫామ్ తో జత పరచవలెను. తేది: 20.05.2025 లోపు పూర్తి చేసిన ధరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా లో సమర్పించగలరని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటనలో తెలియజేశారు.

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్.!

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగినది.
పహాల్గంలోని టెర్రరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత దేశంలో ఉన్న పాకిస్థానీయులందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేడు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా

BJP district president

 

అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ దుమాల శ్రీకాంత్,జిల్లా కార్యదర్శి శ్రీ గొప్పాడి సురేందర్ రావు, ఒబిసి మోర్చా అధ్యక్షుడు శ్రీ నంద్యాడపు వెంకటేష్, మరియు మాజీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు శ్రీ పొన్నాల తిరుపతి రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీ నాగుల శ్రీనివాస్ మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మరియు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు వివరాలు .

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి….

– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

 

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సంబంధిత ఎంపీడీవో ఇతర అధికారులతో కలిసి
కలెక్టర్ పరిశీలించారు.

Grain

ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు . ఐకేపీ, కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్. సూచించారు. నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, ఆద్వర్యంలో ఇప్పటి దాకా 2715 మంది రైతుల నుంచి 53,602 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం రూ. 28కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సుశీల్వా, కొల్చారం మండల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 6 నుంచి నెల రోజులపాటు ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్ లలో అండర్- 14, 16, 19, 23 వయసు వారు పాల్గొనవచ్చని చెప్పారు. శిక్షణలో పాల్గొనేవారు
https://hycricket. org వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు సిరిసిల్ల
జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కులగణన చేయలేదని, 1931 లో బ్రిటిష్ ప్రభుత్వం కులగణన తర్వాత, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కులగణన పై సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీసీ సంఘాల కులగణనను సొంత పార్టీ కార్యకర్తలే చించేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆర్టికల్ 370 రద్దు, వక్ఫ్ బిల్లును బీజేపీ ఆమోదించిందని, ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తి బీజేపీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోతోందని, కులగణన బిల్లు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు వారంలో చెల్లించకపోతే, రైతుల తరఫున సంఘర్షణ చేస్తామని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం బృందం అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

 

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో,పాఠశాలల్లో విద్యార్థినిలకు గ్రామాల్లో,పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,05 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల,కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

District SP.

 

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని , ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని.

ప్రధానంగా మహిళలు,విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లో కానీ,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్100 లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ గారు తెలిపారు.

 

సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు.

కార్మికులహక్కుల సాధనకు సమరశీల పోరాటం చేయాలి

సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

చికాగో వీధుల్లో కార్మిక వర్గం చిందించిన నెత్తుటి చారికలు నేటికీ స్ఫూర్తిదాయకమని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం వంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి కార్మికులపై ఉందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఉద్ఘాటించారు. మే డే సందర్భంగా కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో కాల్వ నర్సయ్య యాదవ్ చిత్రపటం వద్ద జరిగిన మే డే వేడుకలో అరుణపతాక ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ, అప్పటి దుర్మార్గపు ప్రభుత్వం కార్మికుల గొంతు నొక్కాలని ప్రయత్నించినా, వారి ఐక్య పోరాటం ముందు తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. న్యాయమైన వేతనాలు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, జీతంతో కూడిన సెలవులు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు, కార్మిక సంక్షేమ చట్టాలు వంటి ఎన్నో విజయాలు ఆపోరాటాల ఫలితమేనని ఆయన అన్నారు.
నేడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయని, పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కార్మిక వర్గం మరింత ఐక్యంగా, సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
సమానత్వం కోసం జరిగే ఈపోరాటంలో ప్రతి ఒక్క కార్మికుడు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, కార్మికుల హక్కులను హరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఆటోరిక్షా, హమాలి కార్మికుల నుండి మొదలుకొని అడ్డా కూలీల వరకు ప్రతి ఒక్క కార్మికుడు “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అనే చారిత్రాత్మక నినాదంతో స్ఫూర్తి పొంది, సమానత్వం కోసం, తమ హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని అన్నారు. కార్మిక శక్తికి తిరుగులేదని నిరూపించే సమయం ఆసన్నమైందని పురమళ్ళ శ్రీనివాస్ అన్నారు. ఈజెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బొమ్మకల్ సిపిఐ గ్రామ కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ యాదవ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, హమాలి నాయకులు మేకల చంద్రయ్య, రాయమల్లు,పాశం మోహన్, గాలిపెల్లి సుధాకర్, మాదరవేణి సంపత్, పెంటమీద ఐలయ్య, పుట్టపాక శంకర్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం.!

జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లో పి.సి.పి.ఎన్.డి.టి సమావేశం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

ఈరోజు సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. రజిత ఆధ్వర్యంలో
పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ కమిటీ సమావేశంలో జిల్లాలో పి.సి.పి.ఎన్.డి.టి నిబంధనలు వ్యతిరేకంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్లను, లింగ నిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారము మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు10,000 రూపాయల జరిమానా విధిస్తామని గైనకాలజిస్ట్ డాక్టర్లకు, రేడియాలజిస్ట్లకు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఈ సందర్భంగా సూచించినారు. ఈ కమిటీ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతూరు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి శుక్ల, ఎన్జీవో కమిటీ సభ్యురాలు ఝాన్సీ లక్ష్మి, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్. ఇ.బాలయ్య, డి.ఇ.ఓ మహేష్ పాల్గొన్నారు.

DNSS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

DNSS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారముల్ల యాకూబ్ ఏకగ్రీవ ఎన్నిక

వర్దన్నపేట (నేటిదాత్రి):DNSS

వర్ధన్నపేట పట్టణ మూడో డివిజన్ కు చెందిన మారముల్లా యాకూబ్ ను దళిత నిరుద్యోగ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సోమవారం రోజున డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల కుమార్ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు ఎం యాకోబు ఉద్యమాలు తెలిసిన వ్యక్తి సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి పోరాట యోధులు అని వారన్నారు ఎన్నుకోబడిన మారుమూల యాకూబ్ మాట్లాడుతూ దళితుల సమస్యల పైన నిరుద్యోగుల సమస్యల పైన నిరంతరం పోరాటాలు

General Secretary

చేస్తానని వారు అన్నారు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు తన ఎన్నికకు సహకరించిన డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల కుమారస్వామి డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్ల మిథున్ గారు డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంజర్ల సమ్మయ్య గారు పట్టణ అధ్యక్షులు మునిగాల అరుణ్ కుమార్ గారికి కొండేటి రామచంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఇట్లు
తుమ్మల కుమారస్వామి
డిఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రం

ఇట్లు
మారముల్లా యాకూబ్
డిఎన్ఎస్ఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
వరంగల్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం

ఇందారం గోదావరి ఇసుక.!

ఇందారం గోదావరి ఇసుక రిచ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామ పంచాయతీల ప్రజలు తమ అవసరాలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.అలాగే ఈ అవకాశాన్ని ఎవరైనా అదునుగా చేసుకొని అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జగన్ మోహన్ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,ట్రాక్టర్ యజమానులు గ్రామప్రజలు పాల్గొన్నారు.

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు.టీఎన్జీవో ఉద్యోగులు మంచిర్యాల జిల్లా చైర్మన్ గా గడియారం శ్రీహరిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జైపూర్ తహసిల్దార్ వనజ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం,వారి అభివృద్ధికి ఎల్లప్పుడు తోడుగా ఉంటూ తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. శుక్రవారం తహసిల్దార్ వనజా రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version