వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించడం ఘనంగా జరుగుతుంది,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తుంది దానిలో భాగంగానే పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు, ఆమెతోపాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు , రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో మండలంలోని వీధులు మెయిన్ రోడ్లు వెంబడి చెత్తాచెదారం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీ సిబ్బందితో రెండు రోజుల నుంచి పనులు మమ్మురంగా జరుగుతున్నాయి దీనికి మండలంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మినిస్టర్ ప్రోగ్రాం ఉండడం వల్ల మండల కేంద్రం క్లీన్ అండ్ గ్రీన్ గా పిచ్చి మొక్క లేకుండా రోడ్లన్నీ శుభ్రంగా తయారవుతున్నాయని , ఏది ఏమైనా శుక్రవారం రోజు జరిగే మహిళా శక్తి సంబరాలకు మినిస్టర్ తో పాటు జిల్లా అధికారులు రావడం వల్లనే మా గ్రామంలోని వీధులు రోడ్లు శుభ్రంగా ఉన్నాయని, గ్రామపంచాయతీ సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య పనులను నిర్వహించడం పట్ల మండల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు,

మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన.

మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-11.wav?_=1

చిట్యాల మండలంలో మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి* ఈనెల 18వ తారీకున మహిళా సదస్సు కార్యక్రమానికి పంచాయతీరాజ్ మహిళా ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను ముమ్మరం పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా సదస్సు చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం జిల్లాలోని మహిళలందరూ విచ్చేసి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అందులో భాగంగానే శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు కావున వివిధ మండలాల గ్రామాల్లోని మహిళలు విధిగా జిల్లాలోని ప్రతి ఒక్క మహిళ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి డిపిఎంలు ఎంపీడీవో జయశ్రీ ఎంపీ ఓ రామకృష్ణ జిల్లా అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు చిలుముల రాజమౌళి బుర్ర శ్రీను బుర్ర మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మొక్కలు నాటిన మండల విద్యాధికారి.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలోని వర్షకొండ మండల పరిషత్ పాఠశాలలో విద్యాధికారి శ్రీ బండారి మధు సందర్శించడం జరిగింది పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని అభినందించాడు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో మొక్కలను పెంచడం ప్రతి విద్యార్థి భాద్యతగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్.

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్ గా శ్రీపతి రాములు గౌడ్ నియామకం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ,సంస్థ నియమ,నిబంధనలు పాటిస్తూ,సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని,ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని,ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని,పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్ కు అండగా బీసీలు ఉండాలి .

కాంగ్రెస్ కు అండగా బీసీలు ఉండాలి

జిల్లా కాంగ్రెస్ నేత సాయిలి. ప్రభాకర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక చారిత్రాత్మకమని ఇది సామాజిక విప్లవానికి నాంది అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు బిసి నేత. సాయిలి ప్రభాకర్ పేర్కొన్నారు.అందుకు బీసీ కులాలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు.సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కు బీసీలు అండగా నిలవాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన జనాభా ప్రతిపాదికన ఎవ్వరెంతో వారికంత రిజర్వేషన్ల డిమాండ్ ను దేశంలో తొలిసారిగా తెలంగాణలో అమలు చేయడం గర్వకారణమని అభివర్ణించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించగా అదే బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతానికి పెంచడం పట్ల రాష్ట్ర మంత్రి వర్గానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ కు అండగా నిలబడి పార్టీని గెలిపించాలని ప్రభాకర్ కోరారు.

జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

 

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామేర కిరణ్.

భూపాలపల్లి నేటిధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర కిరణ్ అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో విద్యారంగ సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం అన్నారు దాంతోపాటు సంవత్సరాల నుంచి. గత మూడు సంవత్సరాల నుంచి 8 వేల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీ పూర్తి చేసి పై చదువులకు వెళ్లే విద్యార్థులకు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు సందర్భంగా తెలియజేశారు తక్షణమే బకాయిలను విడుదల చేయాలని వారు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి సందర్భంగా తెలియజేశారు కొన్ని కొన్ని పాఠశాలల్లో వందల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకటి రెండు వాష్రూమ్స్ కంటే ఎక్కువ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా స్థానికంగా జిల్లా కేంద్రంలో ఇంటర్ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఎస్ఎంఎస్ హాస్టల్స్ సొంతభవనాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే నిర్మాణాల్లో ఉన్న భవనాలను పూర్తిచేయాలని వారు అన్నారు సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీఈడీ కళాశాల లా కళాశాల ఏర్పాటు చేయాలని వారు అన్నారు ఈ జిల్లాలో చదువుకోవడానికి అవకాశం ఉన్న హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఉన్నారు తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమర్శిల పోరాటాలకు సిద్ధమవుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ జిల్లా కమిటీ సభ్యులు సాగర్ నిర్మల్ అర్జున్ సూర్య తదితరులు పాల్గొన్నారు

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…

. మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండల వాస్తవ్యులు బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రామస్వామి విజయ గార్ల కుమారుడు చి||వినయ్ -చి||ల||సౌ శ్రీజ గార్ల వివాహ వేడుకల్లో పాల్గొన్ని వధూ వరులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సి ఎస్ ఐ సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్స్
అనంతరం మొగుళ్ళపల్లి మండలం,పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు కాల్వ రాములు -రజిత గార్ల కుమార్తె అక్షిత నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారి వెంట ప్రజా ప్రతినిధులుమండలకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

కలెక్టర్ ఆదేశాలతో కూరగాయల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం

కూరగాయలు, మాంసం, చేపల షాపులు తరలింపు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను కూరగాయలు, మాంసం, చేపల విక్రయదారులు వినియోగించు కోవాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతు బజార్ లోకి తరలించేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణం చేస్తున్నామని, అదేవిధంగా ఈ రైతు బజార్ లోకి మటన్ షాపులు, మాంసం షాప్ లు, చేపల విక్రయం షాపులు సైతం తరలించాలని, ఎవరు కూడా రోడ్డు పక్కన అమ్మకూడదని అన్నారు.బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను జిల్లాలోని వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ డిఆర్డిఏ పిడి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి వయోజనులను అక్షరాస్యత క్రమము పెంచే దిశగా ఈ కార్యక్రమము కొనసాగుతుందని ప్రతి గ్రామము మండలంలో వయోజనులలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి అందరూ కృషి చేయాలని కోరారు. చదువుకోవాలని కోరిక గల వారికి ఉజ్వల భవిష్యత్తును తెలంగాణ ఓపెన్ స్కూల్ విద్యావకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనిచేసే స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరులకు విద్యను అందించడమే తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని, అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ 2008-09 విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి కోర్సును అందిస్తుందన్నారు. 2010-11 నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ను కోర్సును ప్రారంభించిందని తెలియజేశారు.కమ్యూనిటీ మొబైలైజ్డ్ అధికారి సామల రమేష్ మాట్లాడుతూ అక్షరాస్యత తోనే అభివృద్ధిని సాధించగలమని అందుకు అనుగుణంగా మండల పరిధిలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ పరిధిలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు అందరము ఉమ్మడిగా పనిచేసి తమ తమ పరిధిలోగల వయోజనులందరిని అక్షరాస్యతులుగా చేసినట్లయితే దేశ పురోభివృద్ధిలో వారి పాత్ర గణనీయంగా ఉంటుందని, దానివల్ల దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని మీ అందరూ వీటికి అనుగుణంగా పనిచేసి మన జిల్లాను ముందు వరసలో నిలపాలని వారు ప్రత్యేకంగా కోరినారు. పూర్వపు వరంగల్ జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కోఆర్డినేటర్ సదానందం మాట్లాడుతూ వయోజనులలో గుర్తించిన నిరక్షరాస్యులను పదో తరగతి ఇంటర్మీడియట్ లలో ప్రవేశము పొందడానికి వారిని గుర్తించి సంబంధిత మండలంలోని పాఠశాలలో కోఆర్డినేటర్ కు సార్వత్రిక విద్యాపీఠము పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో చేర్పించవలసిందిగా వారు కోరినారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య విభాగ కోఆర్డినేటర్ వేణుగోపాల్ జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు డిఆర్డిఏ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కదలిరండి

జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కదలిరండి

జిల్లా ప్రధాన కార్యదర్శులు క్యాతరాజు సతీష్, రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కనీస వేతనాల అమలు ఉద్యోగ భద్రత తదితర సమస్యల పరిష్కారం కోసం జూలై 9 దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వర్తిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ కార్మికుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వాటి రద్దు కోసం కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని వారు అన్నారు 1885 చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 29 కార్మిక చట్టాలను నాలుగు కొడ్స్ గా మార్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని వారు అన్నారు. 1948 లో వచ్చిన కనీస వేతన చట్టాన్ని పక్కకు పెట్టి కేవలం బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఒకరోజు కనీస వేతనాన్ని 178 రూపాయలుగా నిర్ణయించడం దుర్మార్గమని వారు అన్నారు. ఈ దేశానికి సంపద సృష్టికర్తలు కార్మికవర్గం అయితే మోడీ మాత్రం దేశానికి సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలు బడా పెట్టుబడిదారులని చెప్పడం కార్మిక వర్గాన్ని అవహేళన చేయడమేనని వారు అన్నారు.. అందులో భాగంగా 1975 లో వచ్చిన ఆక్టాయిడ్ ఫార్ములా పారిశ్రామిక వివాదాల చట్టం వీటన్నిటిని ఏవి పరగణలోనికి తీసుకోకుండా మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని వారు తీవ్రంగా విమర్శించారు.. అందులో భాగంగా ఒకవైపు కనీస వేతనాన్ని పెంచాలని కార్మికులు పోరాటం చేస్తుంటే పరిధినాన్ని తగ్గించమని అడుగుతుంటే మోడీ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ లో భాగంగా గుజరాత్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు కార్మికుల యొక్క పని దినాన్ని 10 గంటలుగా నిర్ణయించడం బడా పెట్టుబడి పారిశ్రామికవేత్తలకు మోడీకి మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని వారు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల శ్రీకాంత్, జంపాల పవన్ సిఐటియు వెలిశెట్టి రాజయ్య తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు

రేపటి ప్రజావాణి రద్దు హనుమకొండ జిల్లా కలెక్టర్.

రేపటి ప్రజావాణి రద్దు: హనుమకొండ జిల్లా కలెక్టర్

హనుమకొండ, నేటిధాత్రి.

హనుమకొండ కలెక్టరేట్లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలు గమనించి ప్రజావాణికి రాకూడదని తెలిపారు.

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

కరకగూడెం,,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామంలో మహా జననేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ కరకగూడెం మండల ఇన్చార్జి బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. మహా జననేత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 7వ తేదీన సోమవారం నాడు ఎమ్మార్పీఎస్31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ పతాక ఆవిష్కరణ, మంద కృష్ణ మాది జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చిన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఇల్లందుల సత్యం మాదిగ. ఉపాధ్యక్షులుగా ఇల్లందుల కృష్ణ మాదిగ. కార్యదర్శి ఇల్లందుల యేసు మాదిగ. ప్రధాన కార్యదర్శి ఇల్లందుల నరేష్ మాదిగ. సహాయ కార్యదర్శి వెంకటేష్ మాదిగ. ట్రెజరర్ ఇల్లందుల సమ్మయ్య మాదిగ. కమిటీ సభ్యులు సోమిడి వినోద్ మాదిగ. ఇల్లందుల శ్రీను మాదిగ. ఇల్లందులో నరసయ్య మాదిగ. ఇల్లందుల అర్జున్ మాదిగ. ఇల్లందుల సుకుమార్ మాదిగ. ఇల్లందుల సంతోష్ మాదిగ లను ఎన్నుకోవడం జరిగింది.

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో..

 

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో వ్యాధులను నిర్మూలించాలి

రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాలను అధిగమించాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి,తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తుందని,టీబీ రహిత జిల్లాగా మార్చుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలుపుతూ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి – అరుంధతి పట్నాయక్ ఎం.డీ (ఎన్ హెచ్ ఎం) ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టి.బి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ పై సమీక్షించారు.వరంగల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి.సంధ్యరాణితో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.జిల్లాలో 8 రకాల వ్యాధి కారకాల బారిన పడే వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,04,979 మంది ఉన్నారని వారికి 3,794 మందికి జూన్ 3 నుండి రెండో విడత టిబి,మరియు 8 రకాల వ్యాధి గ్రాస్తులకి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Warangal District Collector Dr. Satya Sarada

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి, తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తున్న నేపథ్యంలో టీబీ రహిత జిల్లాగా మార్చుటకు మరింత తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సంబంధిత వైద్య అధికారులు ,సిబ్బంది  పాల్గొన్నారు.

శిథిలావస్థలో ఉన్న గదిలో తరగతులు నిర్వహించవద్దు

శిథిలావస్థలో ఉన్న గదిలో తరగతులు నిర్వహించవద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జిల్లాలో శితిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శిథిల గదులు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు.

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు

కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

జూన్ 28, 29 తేదీలలో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మ్యూజికల్ క్రియేటివ్ ఫామ్ విభాగంలో టి హరిణి బంగారు పతకం, బి మగ్న నిర్వాన వెండి, టి దృతిపర్ణిక, ఎం విధ్విన్, బి లవణ్ కుమార్, బి ఆరాధ్య లు రజిత పతకాలు సాధించారని తెలిపారు. క్రియేటివ్ వెపన్ విభాగంలో పి అవిక వెండి పతకం, టి హరిణి, కె కౌశిక్ మగ్న నిర్వాన రజిత పతకాలు, చిల్డ్రన్, ఎంగెస్ట్ కేటగిరి పాయింట్ ఫైటింగ్ విభాగంలో బి ఆరాధ్య వెండి పతకం, టి హరిణి రజిత పతకం, బి మాగ్న నిర్వాన, కె హరిణి, టి దృతిపర్ణిక లు వెండి పతకాలు, ఎం విధ్విన్ బంగారు , కె కౌశిక్, ఎం విధిష దేవి రజిత పతకాలు, ఎస్ సంజన బంగారు పతకం సాధించారన్నారు. అదేవిధంగా లైట్ కాంటాక్ట్ ఫైటింగ్ విభాగంలో ఎం విధిష దేవి, ఎస్ సంజన, బి లవణ్ కుమార్ లు బంగారు పతకాలు, కె హరిణి రజిత పతకాలు, సీనియర్ మాస్టర్స్ విభాగంలో క్రియేటివ్ ఫామ్, క్రియేటివ్ వెపన్ విభాగాలలో జి అశోక్ వెండి, రజిత పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన తమ విద్యార్థులను తెలంగాణ కిక్ బాక్సింగ్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్ లు ప్రత్యేకంగా అభినందించినట్లు ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ.

సిరిసిల్ల జిల్లాలో ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ

*ప్రజావాణికి 157 ఆర్జీలు రాక *

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డీఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 8, జిల్లా వ్యవసాయ అధికారి,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున, ఫిషరీస్, జిల్లా సంక్షేమ అధికారి, ఈఈ నీటి పారుదల శాఖ, ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎల్ డీ ఎం, ఈఈ పీఆర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ హ్యాండ్ లూమ్స్, మైనార్టీ, ఆర్ టీ సీ, జడ్పీ సీఈవో, ,సెస్, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

 

 

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, మణెమ్మ,శంకర్,రాములు, సత్తన్న, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, మున్సిపాలిటీ కమిషనర్ గా సుభాష్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు.సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు.

బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్చార్జిగా.

బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్చార్జిగా వస్కుల ప్రవీణ్ కుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట అధ్యుక్షులు మంద ప్రభాకర్ బి.యస్.పి వరంగల్ ఇంచార్జ్ గా వస్కుల ప్రవీణ్ కూమార్ ని నియమించారు
ఈ సందర్భంగా వస్కుల ప్రవీణ్ కూమార్ మాట్లడుతూ బహుజన ఉద్యమాన్ని మరింత నిబ్బద్దతో నిర్వహిస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రామంలో రాష్ట్ర నాయకులు ఉపేంద్ర సహు,శనిగరపు రాజు
,జిల్లా నాయకులు ,తదితర బహుజన నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version