గ్రామంలో స్తంభాలకు బిగిస్తున్న వీధి దీపాలు..

గ్రామంలో స్తంభాలకు బిగిస్తున్న వీధి దీపాలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం గ్రామంలోని విధి ప్రాంగణంలో గత కొన్ని రోజులుగా పనిచేయని వీధి దీపాలు నూతన సర్పంచ్ వినోద బలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ గారి చొరవతో మళ్లీ వెలుగులు నింపుతాయని.ఈ ప్రాంతం గ్రామానికి ముఖ్యమైన కేంద్రం కావడంతో వందలాది మంది భక్తులు ప్రయాణికులు, గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని వీధి దీపాలు వెలగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీధి దీపాలు బిగిస్తున్న పరిసరా ప్రాంతాల్లో ,రాత్రివేళ రాకపోకలు సులభ మవుతాయని. గ్రామ అభివృద్ధికి ఇది మంచి ఆరంభమని గ్రామస్తులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు అభినందిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version