యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా..

యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధ వారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో యూరియా సరఫరా, క్రాప్ బుకింగ్, ఉద్యాన పంటలు సాగు తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో యూరియా సరఫరాపై టాస్క్ ఫోర్స్ టీములు పటిష్టమైన నిఘా పెంచాలని సూచించారు. మండలాల వారిగా యూరియా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న మండలాల నివేదిక అందించాలని ఆదేశించారు.
పి.ఏ.సి.ఎస్ కేంద్రాల వద్ద రైతులకు సరిపడేంత యూరియా నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని
టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మికంగా రిటైల్ షాపుల లో తనికీలు చేపట్టాలని,
ప్రైవేటు డీలర్లు కొన్ని చోట్ల బ్లాక్ చేసే అవకాశం ఉందని పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
యూరియా కు కొరత లేదని, రాబోయే 15 రోజులు చాలా కీలకమని పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మొగుళ్ళ పల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ చేయడం జరిగిందని భూసేకరణ చేపట్టిన భూమిలో పంటలు సాగు చేపట్టకుండా అలాగే సాగులో ఉన్న పంటలు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా నిల్వలు, విక్రయాలపై నివేదికలు
ఏ రోజుకారోజు అందచేయాలని ఆదేశించారు. రైతు బీమా క్లెయిమ్స్ లో జాప్యం జరుగకుండా సత్వరమే విచారణ చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో అవసరమైన యూరియా కొరకు నివేదికలు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. అదనపు సేల్స్ పాయింట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏలు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version