మురికి కాలువలశుభ్రం చేయించిన సర్పంచ్. చాట్ల విజయ రవీందర్…

మురికి కాలువలశుభ్రం చేయించిన సర్పంచ్. చాట్ల విజయ రవీందర్.

మొగుళ్లపల్లి నేటి ధాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సర్పంచ్ గ్రామంలో రెండు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మురికి కాలువలో చెత్త పేరుకుపోవడం వర్షాల పట్ల దోమలు వ్యాప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత కోసం సర్పంచి చొరవ తీసుకొని చెత్తను మట్టిని తొలగింపు చేశారు గత రెండు మూడు రోజుల్లో గ్రామ సర్పంచ్ చాట్ల రవీందర్ విజయ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయించి గ్రామ వీధుల్లో మురికి నీరు నిలవకుండా ప్రధాన కాలువలో పేర్కొన్న చెత్త చెదారాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు దోమల నివారణ గురించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఊరు మొత్తం స్ప్రే చేయించారు గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వీధి దీపాలు తాగునీటి సరఫరా మురికి కాలువలు శుభ్రం చేయించడం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం గ్రామ సర్పంచ్ గా నా బాధ్యత అని తెలిపారు ఆయన వెంట వార్డు సభ్యులు ఏలేటి మధుకర్ రెడ్డి గుడిమల్ల జయసుధ రమేష్ చెక్క నరేష్ చెక్క వెంకటేష్ పాల్గొన్నారు

శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ పనులు…

శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ పనులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుశీల కార్యదర్శి హరిఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ పారిశుద్ధ పనులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాలువలను క్లీన్ చేయడం, రోడ్లను ఊడ్చడం, డ్రైడే ఫ్రైడే లో భాగంగా ఇంటింటికి వెళ్లి నీటి ట్యాంకులు, నీటి తొట్టిలను అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వప్న ,ఆశా వర్కర్ స్వప్న గ్రామ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version