శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ పనులు
నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుశీల కార్యదర్శి హరిఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ పారిశుద్ధ పనులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాలువలను క్లీన్ చేయడం, రోడ్లను ఊడ్చడం, డ్రైడే ఫ్రైడే లో భాగంగా ఇంటింటికి వెళ్లి నీటి ట్యాంకులు, నీటి తొట్టిలను అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వప్న ,ఆశా వర్కర్ స్వప్న గ్రామ సిబ్బంది పాల్గొన్నారు
