డివైడర్ ని ఢీకొన్న కారు బాలుడి ఆరోగ్యం విషయం…

డివైడర్ ని ఢీకొన్న కారు బాలుడి ఆరోగ్యం విషయం
* మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ఆసుపత్రికి తరలింపు
* ముగ్గురికి స్వల్ప గాయాలు
* కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తూ ప్రమాదం

మహాదేవపూర్ నవంబర్ 5 (నేటిదాత్రి)

 

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొన్న సంఘటన బుధవారం రోజున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కార్తీక మాసం సందర్భంగా జనగాం నుండి కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామని కారు అదుపుతపడంతో డివైడర్ ని డి కోనడంతో నాలుగు సంవత్సరాల బాబుకు తీవ్రంగా గాయాలు కాగా మహదేవపూర్ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..

షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..!

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వేరే కారును తప్పించబోయి అనూహ్యంగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొనడంతో..

కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు డ్రైవర్ వేరే కారును తప్పించబోయాడు. కానీ, అనూహ్యంగా డివైడర్‌ను ఢీకొని కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో షబ్బీర్ అలీ కారులో లేకపోవడంతో ఆయనకు అపాయం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ కొరకు స్థల పరిశీలన చేసేందుకు వచ్చిన మంత్రుల బృందంతో ఆయన కామారెడ్డి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ కారు ప్రమాదం చోటుచేసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version