డివైడర్ ని ఢీకొన్న కారు బాలుడి ఆరోగ్యం విషయం
* మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ఆసుపత్రికి తరలింపు
* ముగ్గురికి స్వల్ప గాయాలు
* కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తూ ప్రమాదం
మహాదేవపూర్ నవంబర్ 5 (నేటిదాత్రి)
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొన్న సంఘటన బుధవారం రోజున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కార్తీక మాసం సందర్భంగా జనగాం నుండి కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామని కారు అదుపుతపడంతో డివైడర్ ని డి కోనడంతో నాలుగు సంవత్సరాల బాబుకు తీవ్రంగా గాయాలు కాగా మహదేవపూర్ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
