కోట గుళ్ళు శివరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ
ఆలయ పోషకులకు
కళ్యాణ పత్రిక అందజేత
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో
ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఈనెల 15 ఆదివారం నుండి, 17 మంగళవారం , వరకు మూడు రోజులపాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సోమవారం ఆలయ పోషకులు లలిత నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ రాజేశ్వరప్రసాద్ లలిత దేవి దంపతులు, డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులకు కళ్యాణ పత్రికను కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అలయ అర్చకులు బూరుగుపల్లి మఠం గంగాధర్, జూలపల్లి నాగరాజు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పోషకులకు ఆశీర్వచనాలు అందజేశారు.
