ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

కరకగూడెం,,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామంలో మహా జననేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ కరకగూడెం మండల ఇన్చార్జి బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. మహా జననేత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 7వ తేదీన సోమవారం నాడు ఎమ్మార్పీఎస్31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ పతాక ఆవిష్కరణ, మంద కృష్ణ మాది జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చిన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఇల్లందుల సత్యం మాదిగ. ఉపాధ్యక్షులుగా ఇల్లందుల కృష్ణ మాదిగ. కార్యదర్శి ఇల్లందుల యేసు మాదిగ. ప్రధాన కార్యదర్శి ఇల్లందుల నరేష్ మాదిగ. సహాయ కార్యదర్శి వెంకటేష్ మాదిగ. ట్రెజరర్ ఇల్లందుల సమ్మయ్య మాదిగ. కమిటీ సభ్యులు సోమిడి వినోద్ మాదిగ. ఇల్లందుల శ్రీను మాదిగ. ఇల్లందులో నరసయ్య మాదిగ. ఇల్లందుల అర్జున్ మాదిగ. ఇల్లందుల సుకుమార్ మాదిగ. ఇల్లందుల సంతోష్ మాదిగ లను ఎన్నుకోవడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version