20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం…

20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ రాజు నాయక్- పద్మ పార్టీ కౌన్సిలర్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి టీపీపీసి సభ్యులు చల్లూర్ మధు,పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలియజేయడం జరిగింది ఉచిత కరెంటు 200 యూనిట్లు, 500 రూపాయలకు వంట గ్యాస్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, రైతు భరోసా, ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ప్రతినియోగ వర్గంలో ఇంటిగ్రేడ్ హై స్కూల్, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు సంక్షేపతకలతో ముందుకు వెళుతుందని తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు మాట్టేవాడ సురేష్, శనిగరపు తిరుపతి, మంతెన సాంబయ్య, నోముల నారాయణ, ఇస్తారి, యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పాల శీను, రాజశేఖర్ జన్ను, కోయిల క్రాంతి, రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version