విద్య సంస్థల బంద్ విజయవంతం.

విద్య సంస్థల బంద్ విజయవంతం.

ధనిక రాష్ట్రం అంటూనే మరో వైపు ఖజానా ఖాళీ

వామపక్ష విద్యార్థి సంఘాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-85.wav?_=1

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో అధిక పీజులు వసూల్ చేస్తూ విద్య హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపిస్తూ అలాగే ప్రభుత్వ పాఠశాలలు,గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు బుదవారం చేపట్టిన విద్య సంస్థల బంద్ నర్సంపేటలో విజయవంతం అయ్యింది.ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించి విజయవంతం చేశారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్,జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయింది.కేసీఆర్ ను గద్దేదించే పోరాటాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయాన్నారు.పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తామని,విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని,నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పారు.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పెండింగ్ బకాయిలు పెట్టకుండా,విద్య రంగంలో ఉన్నా అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ,ఫీజు నియంత్రనా చట్టం తీసుకోస్తు, విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని కోరారు.

జాతీయ నూతన విద్య విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23 న తలపెట్టిన విద్య సంస్థల బంద్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని బంద్ ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్, బానోత్ స్టాలిన్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు ,జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం

విద్యా శాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి

పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్,మల్లారపు ప్రశాంత్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-82.wav?_=2

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో విద్యా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం అయ్యిందని తెలిపారు.

Education Minister

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ,ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకుని రావాలనీ,ఖాళీగా ఉన్న టీచర్, ఎంఇఓ, డిఇఓ, మరియు లెక్చరర్స్,ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయాలనీ,అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల, హస్టల్స్ భవనాలుకు స్వంత భవనాలు నిర్మించాలి.గురుకులాల సమయాన్ని శాస్ర్తీయంగా మార్చాలనీ,NEP -2020 రద్దు చేసి, తెలంగాణ అసెంబ్లీలో అమలు చేయకుండా తీర్మానం చేయాలనీ,పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలనీ,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలనీ,బడ్జెట్, చిన్న ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.ఆర్ధిక సహాకారం అందించాలనీ విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలనీ అన్నారు.జిల్లాలో నిర్వహించిన బంద్ లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జశ్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్దు, సాయి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

మండల ఉపాధ్యక్షులు చెట్టుపల్లి చందు

మంగపేట: – నేటి ధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ తరపున రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు కళాశాలలు విజయవంతం చేయండి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శెట్టిపల్లి చందు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు న్యాయం చేయలేదని విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారినా గాని రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థులకు ప్రాముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని విద్యార్థులకు బస్సు సౌకర్యాలు బస్సు చార్జింగ్ తగ్గించాలని పూర్తిస్థాయిలో విద్యార్థులకు హాస్టల్లో స్కూల్లలో మౌలిక సదుపాయాలు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తుంది విద్యార్థులు తలచుకుంటే ఏదైనా చేస్తారని ఎస్ఎఫ్ఐగా వారు హెచ్చరించారు అదేవిధంగా విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు చేయాలని ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ పోస్ట్లు ఎంఈఓ డీఈవోలు పోస్టింగులు అమలు చేయాలని అదేవిధంగా ప్రవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మరియు ప్రైవేటు యూనివర్సిటీలపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు బాధ్యత ప్రభుత్వ వహించాలని ఇప్పటికే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్ విడుదల కాక ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది హాస్టల్లో టైం టేబుల్ ప్రకారంగా విద్యార్థులకు మెస్ పాటించాలని అన్నారు రాష్ట్రంలో మాటల్లో తెలియజేశారు గాని చేతుల్లో లేదని ప్రజా పాలన చేస్తామని ప్రజలకు ఎటువంటి న్యాయం లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది దీనిపై ప్రభుత్వం చెయ్యాలని అన్నారు లేని ఎడల గత ప్రభుత్వం లెక్కే ఈ ప్రభుత్వానికి కూడా విద్యార్థులను ఏకమై సమాధానం చెప్తామని సూచన తెలియజేశారు
లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులం వారి తల్లిదండ్రులతో పాటు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

 

మంచిర్యాల బంద్ విజయవంతం.

మంచిర్యాల బంద్ విజయవంతం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రమూకలు హిందువులపై దాడి చేసి 25 మందిని కిరాతకంగా చంపేసిన దుశ్చర్యను నిరసిస్తూ శనివారం హిందూ సంఘాల ఐక్య వేదిక మంచిర్యాల బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది.పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అంటూ బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం చేశారు.హిందూ సంఘాలకు ఐక్య వేదిక అధ్యక్షులు కార్యదర్శి,డేగ రవింద్, కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ హిందువులంతా ఏకమై గర్జించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉగ్రవాదం పై ఒక పాదం మోపి సమూలంగా పాతలానికి తొక్కేయాలని ప్రభుత్వాన్ని కోరారు.బందుకు మరియు బైక్ ర్యాలీకి సహకరించి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు,కుల సంఘాలకు,వ్యాపారస్తులకు, వివిధ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేశారు.

నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

పహల్గామ్ దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్య అని అందుకే స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version