ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం
చికిత్స పొందుతున్న వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. శ్రీరాంపూర్ పట్టణంలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో సూపర్వైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ కుమారుడు శ్రీకాంత్ చదువులో గొప్పగా రాణించి ప్రిపేర్ అయ్యే సమయంలో విపరీతంగా తలనొప్పి రావడంతో జిల్లాలోని హాస్పటల్ కి తరలించగా వైద్యులు పరీక్షలు చేసి హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి పంపించారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో ఉండగా కొందరు గ్రామస్తులు ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు ను సంప్రదించండి సహాయమందిస్తారని తెలియజేయడంతో హుటాహుటిన ట్రస్ట్ సభ్యులను సంప్రదించడంతో వెంటనే వారు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సభ్యులు డి.ప్రేమ్ కుమార్,కె. మోహన్ రెడ్డి పాల్గొన్నారు.