సంవత్సరాల నుండి బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం తంగళ్ళపల్లి
నేటిధాత్రి:
లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లిలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూల్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్స్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సూచిందని దీనితో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ఎలాగైనా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు కలెక్టర్ గాని చొరవ తీసుకొని వారికి బిల్లులు వచ్చే విధంగా చొరవ తీసుకొని వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని వేడుకున్నారు కలెక్టర్కు ఇచ్చిన ప్రజావాణి . సంబంధిత అధికారులకు పత్రంలో పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు