శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కల్యాణ్….

శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కల్యాణ్

 

వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారాయన.

వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచరాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.
వైసీపీ హయాంలో పాలకమండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలకమండళ్లు పని చేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు రూ.10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికీ ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలతం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్‌ పేర్కొన్నారు.

గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్..

అసెంబ్లీలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్‌పై చర్చలు కొనసాగాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకెళ్లే బడ్జెట్ ఇదని చెప్పుకొచ్చారు. అపార అనుభవంతో గత ప్రభుత్వ వారసత్వ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ‘నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా…’ అని కవి శేషేంద్ర చెప్పిన కవితను.. మోదీని ఉద్దేశించి కొనియాడారు పవన్ కల్యాణ్.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version