రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
జహీరాబాద్, నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం దిగ్వాల్ రాయపల్లి సమీపంలో ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని జీర్లపల్లికి చెందిన రాజు (48) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని కుడి కాలు పాదం, మూడు దంతాలు విరిగిపోయాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, రాజుకు ప్రథమ చికిత్స అందించి జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
