మోరిల నుంచి రోడ్లపైకి మురికినీరు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-1.wav?_=1

మోరిల నుంచి రోడ్లపైకి మురికినీరు..

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..

రామాయంపేటలో వింత పరిస్థితి!

రామయంపేట నేటి ధాత్రి (మెదక్)

సాధారణంగా మురికినీరు రోడ్ల నుండి మోరుల (డ్రైనేజీ లైన్ల) వైపు పోవాలి. కానీ రామాయంపేట పట్టణంలో మాత్రం దీనికి విరుద్ధంగా, మోరుల నుంచే మురికినీరు రోడ్లపైకి వస్తుండడం నిజంగా వింత మరియు ఆందోళన కలిగించే విషయం. నిన్నటి వర్షానికి మోరిలు నిండిపోయి మురికినీరు రోడ్ల మీదికి పొంగిపొర్లిన ఘటన ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది.

ఈ మురికినీరు పొంగిపొర్లే ప్రాంతాల్లో ప్రజలు నిత్యవసరాలకు అవసరమైన కూరగాయల మార్కెట్లు ఉండటం గమనార్హం. ఫలితంగా మురికి నీటిలో నానిన పరిస్థితుల్లో ప్రజలు కొనుగోళ్లు చేయాల్సి రావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉంది. కాలరా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జల వ్యాధుల ప్రమాదం రాకముందే అప్రమత్తమవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక నివాసితుడు ఒద్ది స్వామి మాట్లాడుతూ, “ఇది రామాయంపేటలో సాంప్రదాయ మార్గాలకు విరుద్ధమైన పరిస్థితి. మోరిల నుంచి రోడ్లపైకి నీరు రావడం అంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టు స్పష్టం అవుతోంది. ప్రజలు ఆ మార్గంలో నడవలేక, సిగ్గుపడే స్థితికి వచ్చారు” అని అన్నారు.

ఇకపోతే, డ్రైనేజీ సమస్యతో పాటు రోడ్ల వెడల్పు కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రధాన రహదారుల వెడల్పును పెంచడం, డ్రైనేజీ లైన్లను పునఃసంఘటన చేయడం ద్వారా ఈ సమస్యకు స్థిర పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు రామాయంపేట మున్సిపాలిటీ అధికారులను తక్షణమే స్పందించి, మోరిల పునరుద్ధరణ, రోడ్ల విస్తరణ పనులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వర్షాకాలం ముగించేలోగా శుభ్రమైన పరిసరాలను కల్పించాలన్నదే స్థానికుల ఆశ.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version