రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
నడికూడ,నేటిధాత్రి:
మండల రైతు వేదిక నందు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.మధు డా. హరి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి 6 అంశాల పైన ముఖ్యంగా మాట్లడటం జరిగింది.వాటిలో
తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చును తగ్గించండి.
అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడండి.
రసీదులను భద్రపరచండి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందండి
సాగు నీటిని ఆదా చేయండి భావితరాలకు అందించండి
పంట మార్పిడి పాటించండి సుస్థిర ఆదాయాన్ని పొందండి.
చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.
యూరియాను అధిక మోతాదులో వాడటం వల్ల నేల యొక్క ఆమ్లత్వం పెరిగి నేలలోని సూక్ష్మ జీవులు నశించడమే కాకుండా ఇతర పోషకాలను పంట తీసు కోకుండా చేసి దిగుబడులను తగ్గిస్తాయి.కాబట్టి యూరియా సిఫారసు చేసిన మేరకు నుండి దఫాలుగా ఇతర పోషకాలతో కలిపి వేసుకోవాలి.
వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి విధానం ద్వారా నేలసారాన్ని సహజ సిద్ధంగా పెంచే పప్పు ధాన్యపు పంటలు, నూనెగింజ పంటలను మరియు నీటిని తక్కువగా వినియోగించుకునే చిరు ధాన్య పంటలను వరి తర్వాత యాసంగిలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు.
నీటిని ఆదా చేసే యాజమాన్య పద్ధతులైన సూక్ష్మ బింధు సేద్యం మరియు మల్చింగ్ ద్వారా 50-60% నీటిని సంరక్షించుకోవడమే కాక అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.వరి సాగుచేసే నేలల్లో నీరు ఇంకే గుణం కోల్పోయి,భూగర్భ జలాల మట్టం తగ్గిపోతుంది.
ఒక ఎకరం వరి సాగు చేసే నీళ్ళతో 3 ఎకరాల జొన్న, మొక్కజొన్న మరియు వేరుశనగ పంటలను సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు రైతుల కు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్ర మానికి హాజరైన మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ మాట్లడుతూ తొలకరి వర్షాలకు జీలుగ, మరియు పెసర్లు,వరి నాట్లకు ముందు వేసుకొని భూమిలోనే 45 రోజుల తర్వాత కలియ దున్నడo వలన నేలలోని కర్బన పదార్థం పెరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాదారపు,రామకృష్ణ,జోరు ప్రశాంత్,కిన్నెర చికిత, వ్యవసాయ కళాశాల విద్యార్థినులు మరియు రైతు సోదర సోదరీమణులు పాల్గొనడం జరింగింది.