Badi Bata Drive Boosts Government School Admissions
జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బడిబాట కార్యక్రమం
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మండలంలోని వర్షకొండ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల కోసం తల్లిదండ్రులని కలిసి పాఠశాల లో జరిగే కార్యక్రమాలను వివరిస్తూ ప్రవేట్ పాఠశాల కు దీటుగా మన పాఠశాల ఉంది అని అడ్మిషన్లు సేకరిస్తున్న క్రమంలో, గ్రామ సర్పంచ్ పొన్నకంటి చిన్న వెంకట్ యొక్క కుమార్తె పొన్నకంటి తేజస్వినిని మా పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు, అలాగే గ్రామంలో ఇతర పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు కూడా మన ఊరి పాఠశాలలో అన్ని చక్కని వసతులు ఉన్నాయని ఉపాధ్యాయులు మంచిగా బోధిస్తున్నారని అలాగే అమ్మాయిలకు కుట్టుమిషన్లు అబ్బాయిలకు వ్యవసాయం మరియు చదువుతోపాటు నేర్పిస్తున్నారని ఇట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వారితోపాటు వార్డు సభ్యులు కూడా వారి ఇంట్లో పిల్లల్ని ఉన్నత పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శివ కృష్ణ, ఇమ్మానుయేల్, స్వామి మరియు గ్రామంలోని ఉన్నటువంటి నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
