చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని లింగంపేట గ్రామంలో మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోచమ్మ బోనాలు బుధవారం కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ… ఈ సందర్భంగా విద్యార్థులు బోనాలు వండి వివిధ వేషాధారణలో బోనాలను ఊరేగింపుగా తీసుకొని పోచమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా పడాలని అమ్మవారిని కోరుకున్నారు. పోచమ్మ బోనాల సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు , పోతరాజుల విన్యాసాలు చూపరులని ఆకట్టుకున్నాయి. పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు, పండగలు వాటి విశిష్టతల పట్ల విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుండే అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఏనుగుల రేణుక, కముటం స్వప్న, మెంగలి కవిత, పాహిమా, ప్రియాంక, విద్యార్థులు పాల్గొన్నారు.