Telangana award
పల్లెరాములుకు స్టార్ ఆప్ తెలంగాణ జాతీయస్థాయి పురస్కారం
3 వేల పైన షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి నటన
తెలంగాణ యాస బాషలతో ప్రజలను చైతన్య పరుస్తూ షార్ట్ ఫిల్మ్స్
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన పల్లెరాములును స్టార్ ఆప్ తెలంగాణ జాతీయస్థాయి పురస్కారం వరించింది.సోషల్ మీడియా వేదికగ మూడు వేలకు పైగ షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి తెలంగాణలోని పల్లేల జీవిత విదానాలు, యాస బాషలతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు.

వీటిని గుర్తించిన జాతీయ స్థాయి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్విస్ వారు ఆదివారం హైదారాబాద్ రవింద్రభారతిలో పల్లె రాములుకు స్టార్ ఆప్ తెలంగాణ జాతీయస్థాయి పురస్కారాన్ని అందచేశారు.ఇందులో బాగంగ పల్లె రాములుకు జాతీయ పురస్కారాన్ని హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ అద్యక్షుడు కొంపెల్లి సత్యనారాయణతో పాటు స్వర్ణగిరి దేవాలయ అదినేత మనేపల్లి రామారావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

సామాజిక స్ప్రుహను కల్పించే విదంగ లఘుచిత్రాలను చేస్తున్నందుకు గాను ఈ అవార్డును అందచేస్తున్నట్టు అద్యక్షులు కొంపెల్లి సత్యనారాణ తెలియజేశారు.తనకు జాతీయ స్థాయి స్టార్ ఆప్ తెలంగాణ పురస్కారాన్ని అందచేసినందుకుగాను పల్లే రాములు హ్యూమన్ రైట్స్ నిర్వాహకులకు దన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా పల్లెరాములు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామీణ హితివృత్తాలు,జీవన విధానం,రైతులు,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సినిమాలు తీసే ఆలోచనలు ఉన్నట్లు ప్రకటించారు.
