పాలకుర్తి నేటిధాత్రి
తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బి అర్ ఎస్ పార్టీ విజయం సాధించాలని, సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం, రాష్ట్రప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బి అర్ ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.