చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించిన సమాచార హక్కు చట్టం కమిటీ సభ్యులు

పరకాల నేటిధాత్రి
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి సమాచార హక్కు చట్టం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మెరిసే విప్లవ ధ్రువతార దొరల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలని రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత ఆమే చాకలి ఐలమ్మ అలియాస్‌ చిట్యాల ఐలమ్మ అని సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైంది తొలి భూపోరాటానికి నాంది పలికిందని దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిందని ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు.కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంటి ముదిరాజ్,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి,రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!