మల్కాజ్గిరి, నేటిధాత్రి
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మర్రి వి రాజశేఖర్ గత రెండు సంవత్సరాలుగా మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వారి అమ్మ మర్రి అరుంధతి పేరు మీద ఆసుపత్రి నెలకొల్పి దాదాపు 2 లక్షల మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఇప్పటిదాకా 6 వేల పైచిలుకు మంది ప్రజలకు అత్యంత ఖరీదుతో కూడుకున్న శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో సైతం మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని యాప్రాల్, నేరెడ్ మెట్, మల్కాజిగిరి, ఆనంద్ బాగ్, వినాయక్ నగర్, వెంకటాపురం, యాప్రాల్ తదితర ప్రాంతాల్లో 12 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
అలాగే ఇతర టెస్టులు మరియు శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న వారిని మరుసటి రోజు ఉదయం బస్సులో అరుంధతి ఆసుపత్రికి తీసుకెళ్ళి డాక్టర్ సంప్రదింపులు చేపించి, అవసరం ఉన్న వారికి శస్త్ర చికిత్సలు సైతం చేయిస్తున్నారు.