Manisha Goud Earns MBBS Degree
ఎంబీబీఎస్ పట్టా అందుకున్న గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ కూతురు గుండ్లపల్లి మనీషా గౌడ్.
యాదగిరిగుట్ట నేటి దాత్రి:
ప్రముఖ విద్యాసంస్థ అయిన కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ పుత్రిక గుండ్లపల్లి మనీషా గౌడ్ ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఘనంగా పట్టాభిషేక వేడుక గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ వేడుకలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అతిథులు పాల్గొని విద్యార్థుల కృషిని అభినందించారు. డాక్టర్ గుండ్లపల్లి మనీషా గౌడ్ తన విద్యాభ్యాసంలో చూపిన పట్టుదల, కృషి, అంకితభావం ద్వారా ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. ఆమెకు పట్టా ప్రదానం చేసిన సందర్భంగా వేదికపై గౌరవ అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్ అందజేయడం జరిగింది.
ఈ సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ గుండ్లపల్లి మనీషా గౌడ్ ను అభినందించారు. వైద్య విద్య పూర్తి చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ ఘన విజయంతో డాక్టర్ గుండ్లపల్లి మనీషా తల్లిదండ్రులు గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ గార్లకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు గర్వకారణంగా నిలిచారు.
