సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కి తరలింపు.
వివరాలు వెల్లడించిన సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ బోయినిపల్లి మండలము జగ్గారావు పల్లి గ్రామానికి చెందిన కొమురయ్య అనే వ్యక్తి తేదీ:12-05-2025 నరోజున తన భార్య తో కలసి సిద్దిపేటలో ఉన్న తన బందువుల పెళ్ళికి వెళ్తుండగా సిరిసిల్ల బస్ స్టాండ్ లో తన భార్య యొక్క హాండ్ బ్యాగ్ లో నుండి 1) బంగారు నల్ల పూసల తాడు, 2) ఒక జత బంగారు చెవుల కమ్మలు 3) బంగారు వంక ఉంగరము 4) బంగారు చైన్ గల బంగారు ఆభరణాలు:48.47 గ్రాములు డబ్బను గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా బస్ స్టాండ్ లో ఉన్న CC కేమేరాల ఆధారంగా నిందితుని గుర్తించి వేల్పుల రాజేశ్వర్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని దర్యాప్తు చేసి తెలుసుకొని.ఈరోజు సిరిసిల్లలోని పెద్దబజారులోని శివాలయం వద్ద అదుపులోకి తీసుకొని దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరగిందన్నారు.
పోలీస్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు విజ్ఞప్తి
1.బస్టాండ్ లాంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు బంగారముతో వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండవలెను.
2. మహిళలు బంగారు ఆభరణాలతో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ఇంటి నుండి బయటకు
వెళ్లినప్పుడు కానీ ఎవరినైనా తోడుగా తీసుకువెల్లవలెను .
3. రద్దీ ప్రదేశాలలో, ఇంటి దగ్గరి ప్రదేశాలలో ఎవరైనా కొత్తగా గాని అనుమానముగా కానీ కనపడితే వెంటనే పోలీస్ వారికి సమాచారము అందించాలి.
4.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లో భద్రపర్చుకోవడం క్షేమాం.