కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
సర్పంచ్ మోటే ధర్మరావు
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ అక్టోబర్ 31
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ ధర్మారావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మన్న మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో రైతుబంధు సంవత్సరానికి 16000, అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం lతో పాటు ఇల్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, ఆసరా పింఛను 5,016, దివ్యాంగులకు 6000 రూపాయలు, సౌభాగ్య లక్ష్మి అర్హులైన పేద మహిళ కు జీవనో భృతి కింద 3000 రూపాయలు, అసైన్డ్ భూములపై యజమాన్య హక్కు కల్పించుట, అనాధలైన పిల్లలకు ప్రత్యేక పాలసీ, ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పథకాలు రావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు , ఉప సర్పంచ్ సరోజన బాపురావు, భారత రాష్ట్ర సమితి గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముడుపు రవీందర్, భారత రాష్ట్ర సమితి మండల నాయకులు పడిదల జగ్గారావు, సంపెల్లి వెంకన్న, భారత రాష్ట్ర సమితి యూత్ మండల అధ్యక్షులు శివాజీ, దేవునూరి కుమార్, చెక్క శ్రీధర్, మంగళపల్లి శ్రీనివాస్, బండారి రామస్వామి, శనగరపు ఎర్ర భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.