తంగళ్ళపల్లి మండలంలో ఈరోజు రెండో విడత నామినేషన్లు ఆఖరి రోజు కావడంతోఆశావాహులందరి నామినేషన్లు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు చివరి రోజు కావడంతో గ్రామాల్లోని గ్రామ ప్రజలు వార్డు ప్రజలు గ్రామాల్లోని గ్రామపంచాయతీలో నామినేషన్లు వేసినారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉన్నందున మండలంలో ప్రతి గ్రామ ప్రజలు నామినేషన్లు వేసిన ఆశావాహులు ఎవరు ఉంటారో ఎవరు బరిలో ఉండరోతెలియని పరిస్థితి ఉండడంతో ఎవరికి వారే గెలుస్తామని ధీమాలో ఉన్నారు. అలాగే మండలంలో ప్రతి నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోలీసులు పోలీసు సిబ్బంది ఎన్నికల రిటర్న్ అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఇట్టి నామినేషన్ పక్రిలో భాగంగా తమ విధులు నిర్వహిస్తు వచ్చేవారికి ఎలాంటి సౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే మండలంలో ఎలాంటి చెదురు మధుర సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటూ గ్రామ గ్రామాన పోలీసుల పర్యవేక్షణలో రక్షణ బాధ్యతలు చేపడుతున్నారు అలాగే నామినేషన్ వేసే క్రమంలో ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరూ నామినేషన్ వేయడానికి వచ్చేవారు సంబంధిత అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ అన్ని అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించారు
