నీళ్లలో నిప్పులు..కేసీఆర్‌ పెట్టిన మంటలు.

అబద్దాలతో అధికారంలోకి, ప్రజల సొమ్ము నీళ్లలో పోసి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే..

`నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసీఆర్‌

`తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసీఆర్‌

`జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసీఆర్‌

`తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్తూ రోజా ఇంటికి వెళ్లిందే కేసీఆర్‌

`రోజా ఇంటిలో రాయలసీమ మీద ప్రేమ ఒలకబోసిందే కేసీఆర్‌

`ఇప్పుడు బనకచర్ల మీద మొసలి కన్నీరు కారుస్తున్నదీ కేసీఆర్‌

`రాయలసీమకు నీళ్లిద్దామని కేసీఆర్‌ అంటే ఆనాడే అడ్డుకున్నది కాంగ్రెస్‌

`పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 45 క్యూసెక్కులకు జగన్‌ పెంచుతుంటే చూసిందే కేసీఆర్‌

`జగన్‌తో కయ్యం కన్నా నెయ్యం కోరుకున్నదే కేసీఆర్‌

`వైఎస్‌. పావురాల గుట్టలో పాయిరమైపోయిండన్నది కేసీఆర్‌

`అదే వైఎస్‌ కొడుకు జగన్‌తో రాజకీయం నెరిపిందీ కేసీఆర్‌

`అవకాశ వాద రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అనిపించుకున్నదే కేసీఆర్‌

`ఆంద్రాకు నీళ్లెలా తీసుకెళ్తారనేది కేసిఆరే.

`రాయలసీమకు నీళ్లొద్దా అని అనేది కేసీఆర్‌.

`అవకాశ వాద రాజకీయాలకు కేరాఫ్‌ కేసీఆర్‌

`తన రాజకీయ ప్రయోజనాల కోసం నాలుక మడతపెట్టడం అలవాటే

`ఉద్యమ కాలంలో అందరూ చూసిందే!

`తెలంగాణలో నీళ్ల కోసమని పాదయాత్ర చేసినట్లు నటించడం తెలుసు.

`బీఆర్‌ఎస్‌ విస్తరించాలని ఆంద్రాకు నీళ్లిద్దామని నమ్మించడం తెలుసు.

`ప్రధాని కావాలన్న పగటి కలలు కనడం తెలుసు

`ప్రజలు బండకేసి కొడితే కండ్లు బైర్లు కమ్మి మళ్ళీ కొత్త నాటకం ఆడడం తెలుసు

`మళ్ళీ సెంటిమెంట్‌ రాజేసి రాజకీయాలను ఏలాలనుకుంటున్నాడు

`పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నాడు

`మళ్ళీ నీళ్ల రాజకీయం మొదలుపెట్టి నిప్పులు పోస్తున్నాడు

నాకు తెలిసిందే నిజం..నేను చెప్పిందే వేదం..నాకున్నదే జ్ఞానం.. మిగతా వారిదంతా అజ్ఞానం..నాది రజో గుణం..నేను సృష్టించిందే తపోవనం..అని పగటి కలలుకనడంలో కేసిఆర్‌ ఫస్ట్‌..తెలంగాణ తెచ్చింది నేనే అని అసత్య ప్రచారం చేసి కేసిఆర్‌ అధికారంలోకి వచ్చాడు. అమర వీరుల త్యాగాల పునాదులు, తెలంగాణ వాదుల అలుపెరగని పోరాటంతో వచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని మోసం చేసి సిఎం కుర్చీలో కూర్చున్నాడు. అడుగడుగునా తెలంగాణను ఆగం చేస్తూనే వచ్చాడు. ప్రజల సొమ్మంతా నీళ్లలో పోసి పనికి రాని కాళేశ్వరం నిర్మాణం చేశాడు. కమీషన్లను దండుకొని కోట్లు గడిరచాడు. నాసిరకం నిర్మాణం చేసి కాళేశ్వరాన్ని మూడేళ్లకే కూలేశ్వరం చేశాడు. తెలంగాణ ప్రజల సొమ్ము నీళ్లలా ఖర్చు చేసి, ఎందుకూ పనికి రాని పనులు చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే..

కాళేశ్వరం అద్భుత సృష్టి నాదే అని కేసిఆర్‌ గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు నాకేం సంబంధం లేదంటున్నాడు. బొట్టు బొట్టు రక్తం కరిగించి, కాళేశ్వరం కట్టానన్నాడు. పిల్లర్లు కుంగిపోయి, కూలిపోయే పరిస్థితి వచ్చే సరికి నా తప్పేం లేదంటున్నారు. కాళేశ్వరం నిర్మాణం కేసిఆర్‌ కోసం ప్రయత్నం మొదలు పెట్టినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. తెలంగాణ మేధావులు, సాగునీటి రంగ నిపుణులు, యూనివర్శిటీల ప్రొఫెసర్లు ఇలా ఎంతో మంది వద్దని వారించారు. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. ఏ ఒక్కరూ కాళేశ్వరం గురించి పాజిటివ్‌గా మాట్లాడిరది లేదు. అయినా మూర?ంగా కేసిఆర్‌ ముందుకు వెళ్లాడు. నీళ్ల గురించి నాకే చెబుతారా? అని ప్రశ్నించిన వాళ్ళందరినీ ఎగతాళి చేశాడు. అప్పుడు అందరూ చెప్పిందే నిజమైంది. కేసిఆర్‌ చెప్పిన సుద్దులన్నీ నీటి మీద రాతలయ్యాయి. తెలంగాణ ఆగమైంది. తెలంగాణ అప్పుల పాలైంది. కాళేశ్వరం తెల్ల ఎనుగైంది. నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసిఆర్‌. తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసిఆర్‌. దేశంలోని అన్ని నదుల నుంచి సుమారు30 వేల టిఎంసిల నీరు సముద్రం పాలౌతుందని అన్నాడు. దేశ వ్యాప్తంగా బీడువారిన భూముల్లో బంగారు పంటలు ఉండేందుకు అద్భుతమైన ప్రాజెక్టులు కట్టొచ్చన్నారు. మరి కేసిఆర్‌ కట్టిందేమిటీ! ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు పనులలో భాగంగా కాలువల తవ్వకాలు కూడా 85 శాతం పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. ఇదంతా దాదాపు 35 వేల కోట్లతో పూర్తి జరిగేది. అదే సమయంలో తెలంగాణలో వున్న పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడేది. అప్పటి వరకు తెలంగాణలో పెండిరగ్‌లో వున్న ప్రాజెక్టుల పూర్తికి సుమారు. రూ .6500 కోట్లతో ఎక్కడిక్కడ సజీవజల తెలంగాణ ఆవిషృతమయ్యేది. కానీ అందుకు విరుద్ధంగా తుమ్మిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని మాయమాటలు చెప్పి కాళేశ్వరం తెరమీదకు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ నిర్మాణం చేయాలో అధ్యయనం చేయడానికే రూ. 6కోట్లు ఖర్చు చేశారు. అంటే తెలంగాణ సంపదను ఎలా నీళ్ళలా ఖర్చు చేయాలనుకున్నారో శాంపిల్‌ చూపించారు. ఆఖరుకు లక్షాఇరవై వేల కోట్లు ఖర్చు చేశారు. అయినా లక్ష్యాన్ని సాధించారా? అంటే అదీ లేదు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా వినియోగించుకునే నీరు కేవలం 240 టిఎంసిలు. అందులో 34 టిఎంసిలు పరిశ్రమలకు, మంచినీటి అవసరాలకు కేటాయించారు. మిగిలిన 206 టిఎంసిలు తెలంగాణ మొత్తం ఎలా సస్యశ్యామలమైందో, ఆ లెక్కల మర్మమేమిటో కేసిఆర్‌ కు మాత్రమే తెలియాలి. తెలంగాణ రాక ముందు సుమారు 25 లక్షల పంపుసెట్లు వుండేవి. అందులో పురాతన బావులు, తర్వాత తవ్విన బావులు మొత్తం 7 లక్షలున్నాయి. తెలంగాణలో వున్న మొత్తం సాగుకింద వున్న భూములన్నింటికీ సరిపడ నీరందించేవి. కాళేశ్వరం వచ్చిన తర్వాత భూ గర్భ జలాలు విపరీతంగా పెరిగినట్లైతే బావుల మీద వ్యవసాయానికి అవసరమైన నీరు పుష్కలంగా అందేది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల సాగు భూమి కూడా రియల్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే గతం కన్నా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. హైదరాబాదు చుట్టు పక్కల ఎటు చూసినా సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో సాగు మాయమైంది. సాగు నీటి అవసరం లేకుండా పోయింది. మరి కాళేశ్వరం వల్ల కాలువల ద్వారా, భూ గర్భ జలాల ద్వారా సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది? కోటిన్నర ఎకరాలు ఎలా సాగయ్యింది. ఈ లెక్కలలో ఏ ఒక్కదానికి పొంతన లేదు. అంటే కాళేశ్వరం వల్ల పెద్దగా ఒరిగింది లేదు. అందుకే కేసిఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరమే వరి వేస్తే ఉరే..అని కొత్త రాగం అందుకున్నాడు. రైతులు కొత్త ఆయకట్టు చేపడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి, నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చిండు. తెలివిగా కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలని చూసిండు. జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసిఆర్‌. అదే సమయంలో తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్లి, తెలంగాణ ముడుపులు చెల్లించుకునే పూజలు అని కొత్త డ్రామా మొదలుపెట్టాడు. తాను అనుకున్న సరికొత్త డ్రామాను రక్తి కట్టించేందుకు మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్లాడు. రాయలసీమ మీద ప్రేమ ఒలకబోశాడు. అప్పటికే బిఆర్‌ఎస్‌ ఆలోచనలు కేసిఆర్‌ మదిలో మొదలయ్యాయి. రెండు సార్లు వరుసగా గెలవడంతో భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశలు పెట్టుకున్నాడు. నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చి కొత్త నాటకం రక్తి కట్టించాడు. కాళేశ్వరం పేరు చెప్పి దేశమంతటా గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. డిస్కవరీ ఛానల్‌ లో దేశంలోని అన్ని బాషలలో కాళేశ్వరం మీద డాక్యుమెంటరీ తయారు చేసి ప్రచారం చేసుకున్నాడు. ఇంతలో టిఆర్‌ఎస్‌ ను బిఆర్‌ఎస్‌ గా మార్చుకొని కొత్త రాజకీయం మొదలుపెట్టారు. కానీ అందుకు కాళేశ్వరం సహకరించలేదు. కేసిఆర్‌ కుటిల రాజకీయం కాళేశ్వరమే బైటపెట్టింది. కేసిఆర్‌ ను తెలంగాణ రాజకీయాలకే దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కొత్త నాటకం కేసిఆర్‌ మొదలుపెట్టిండు. ఇప్పుడు బనకచర్ల మీద మొసలి కన్నీరు కారుస్తున్నడు. తన రాజకీయ ప్రయోజనాల కోసం, బిఆర్‌ఎస్‌ విస్తరణ కోసం రాయలసీమ సస్యశ్యామలం చేద్దామని కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ సమయంలోనే కేసిఆర్‌ కుటిల రాజకీయం గమనించి కాంగ్రెస్‌ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కేసిఆర్‌ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ రాజకీయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎండగట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా వరద జలాల పేరుతో నికర జలాలు నిత్యం 11 క్యూసెక్కులు తరలించుకుపోయే వాళ్లు. ఏపిలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 45 క్యూసెక్కులకు జగన్‌ పెంచుతుంటే ఎందుకు మౌనం వహించారు. ఆ సమయంలో జగన్‌తో కయ్యం కాకుండా నెయ్యం ఎందుకు నెరుపుకున్నాడు. అవకాశ వాద రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కేసిఆర్‌ అన్నది అందరికీ తెలుసు. తెలంగాణ నిధులతో నీళ్లలో నిప్పులు రాజేసి, బనక చర్ల మంటలు రాజేసిందే కేసిఆర్‌. ఉద్యమ సమయంలో ఆంద్రాకు నీళ్లెలా తీసుకెళ్తారన్నది కేసిఆరే. అధికారంలో వున్నప్పుడు రాయలసీమ రైతులు చల్లగా వుండొద్దా! రాయలసీమలో పంటలు పండొద్దా! రాయలసీమ సస్యశ్యామలం కావొద్దా! సముద్రం పాలౌతున్న నీటిని రాయలసీమ వాడుకుంటే తప్పేంటి? రైతులు ఎక్కడైనా రైతులే అంటూ కబుర్లు చెప్పింది కేసిఆరే. ఇప్పుడు మాట మార్చి తెలంగాణకు అన్యాయం జరుగుందని గగ్గోలు పెడుతోంది కేసిఆరే. ఇంతటి ఊసరవెళ్లి లక్షణాలున్న నాయకుడు కేసిఆర్‌ తప్ప ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అవకాశ వాద రాజకీయాలకు కేరాఫ్‌ కేసిఆర్‌.

తన రాజకీయ ప్రయోజనాల కోసం నాలుక మడతపెట్టడం అలవాటే. కేసిఆర్‌ అసలు స్వరూపం ఉద్యమ కాలంలో అందరూ చూసిందే! కేసిఆర్‌ రెండు నాలుకల దోరణి బనకచర్ల విషయంలో మరో సారి తేటతెల్లమైంది. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం గతంలో ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు చెల్లదు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. కేసిఆర్‌ వ్యవహార శైలి తెలియంది కాదు. ఇంకా కేసిఆర్‌ను నమ్మేందుకు జనం సిద్ధంగా లేదు. బనకచర్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం వుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ బనకచర్లను సమర్థించలేదు. ఎక్కడా ఆహ్వానించినట్లు ఎలాంటి ప్రకటన రాలేదు. బిఆర్‌ఎస్‌ నాయకులు గాయ్‌ గాయ్‌ చేసినంత మాత్రాన అబద్దం ఎప్పుడూ నిజం కాదు. కేసిఆర్‌ మాటలు జనం ఇంకా నమ్మడానికి సిద్ధంగా లేరు. పదేళ్లలో కేసిఆర్‌ చేసిన విధ్వంసం చూశారు. కాళేశ్వరం పేరుతో ఎలా దోచుకున్నారో తెలుసుకున్నారు. ఎంత అవినీతికి కేసిఆర్‌ కుటుంబం పాల్పడిరదో కళ్ల ముందు కనిపిస్తూనే వుంది. ఇంకా తిమ్మిని బమ్మి చేసే కేసిఆర్‌ కుటిల రాజకీయాలకు కాలం చెల్లింది. బనకచర్ల మీద బిఆర్‌ఎస్‌ మాట్లాడకుంటేనే మంచిది. గురివింజ తన నలుపునెరగదు అన్నట్లు తప్పుల మీద తప్పులు చేసిన కేసిఆర్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అవినీతి చక్రవర్తిగా మారి కోట్లు కొల్లగొట్టిన కేసిఆర్‌ ను వదిలించుకున్నారు. నెత్తిన పెట్టుకున్న ప్రజలనే మోసం చేసిన కేసిఆర్‌ను బండకేసి కొట్టిన జనం మళ్లీ ఆదరించే ప్రసక్తి లేదు. కేసిఆర్‌ ఎంత తాపత్రయపడినా లాభం లేదు. జనానికి అన్నీ తెలుసు. ప్రజలకు కేసిఆర్‌ మోసాలన్నీ తెలుసు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!