చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని గోపాలపురం గ్రామానికి చెందిన దూడం లావణ్య భర్త దూడం రాజేందర్ కు 50వేల రూపాయల చెక్కును మరియు మండల కొమురక్క భర్త కీర్తి శేషులు మండల రవి) కి 21000/- రూపాయల చెక్కును ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఇరువురికి కలిపి మొత్తం 71 వేల రూపాయల చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు శుక్రవారం రోజున చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ అందజేశారు, ఈ కార్యక్రమంలో, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఏకు రవీందర్ నీలం కుమారస్వామి, శ్రీరామ్ కుమారస్వామి, గొర్రె హరీష్, గోవిందుల సాంబశివుడు, గూడెపు అశోక్, పైడిపాల రాజయ్య,కాట్రేవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.