intintiki nalla connection, ఇంటింటికి నల్లా కనెక్షన్‌

ఇంటింటికి నల్లా కనెక్షన్‌

హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇప్పిస్తామని క్యూసి ఎఇ రాములు తెలిపారు. శుక్రవారం మండలంలోని జయగిరి గ్రామంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను ఎఇ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబం నల్లా కనెక్షన్‌ తీసుకోవాలన్నారు. అక్రమాలు జరగకుండా ఉండాలని పైపులు వేసిన పనితీరును అడిగి తెలుసుకున్నారు. నల్లాకు బిగించిన ఆన్‌, ఆప్‌లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఈ ఇ.సునీత, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ ఇ.అంజు, గ్రామ సర్పంచ్‌ బొల్లవేని రాణి, రాజు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బుర్ర శ్రీధర్‌, వార్డుసభ్యుడు యాటకాల సదానందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *