నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే..
నాళాలు ఆక్రమణతో రోడ్ల పైన వర్షపు నీరు..
చిన్న వానపడితే చాలు చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు
నర్సంపేట నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో ప్రధాన రహదారులు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న దుకాణ యాజమానులు ఎక్కడికక్కడ నాళాలు ఆక్రమించడంతో చిన్న వానకే రోడ్ల పైన నీళ్ళు నిలిచి చెరువులను తలపించే పరిస్థితి నెలకొన్నది. మున్సిపాలిటీ అధికారుల కలిసన్నల్లో కడుతున్న నూతన భవనాల పట్ల చర్యలు తీసుకోకపోవడం వలన నాళాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైతూ వర్షం పడితే చాలు చెరువులను తలపించే విధంగా నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులు మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
