Negligence Blamed in RTC Driver Death
ప్రభుత్వ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్
మొగుళ్లపల్లి నేటి దాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల తలపెట్టిన సమ్మెలో విషాదం నెలకొందని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్ తెలిపారు వారు విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ వరంగల్(D) నర్సంపేటలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు వేచించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు డ్రైవర్ పట్ల మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తిగతం చేశారు శంకర్ గౌడ్ ముమ్మాటికి ఆత్మహత్య కాదని ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరిగిన ఘటనగా తెలిపారు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఈ సమయంలో మనోధైర్యం కలగాలని కోరుకున్నారు ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆందోళన చెడ్డవద్దని క్షణక ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మృతుడి కుటుంబానికి ఐదు కోట్లు ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
